గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి
Published Thursday, 21 March 2019చెన్నై: పేపరు చదువుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ గుండెపోటుతో చనిపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని సూళ్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన కనగరాజ్ గురువారం ఉదయం దినపత్రిక చదువుతూ గుండెపోటు రావటంతో మృతిచెందారు. కాగా 2016 మేలో జరిగిన ఎన్నికల తరువాత తమిళనాడులో మృతిచెందిన శాసనసభ్యుల సంఖ్య 22కి చేరింది.