జమ్మూకాశ్మీర్లో దారుణం
Published Thursday, 21 March 2019శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఉద్దంపూర్ బెటాలియన్లోని 187 క్యాంపులో దారుణం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తనతో పాటు విధుల్లో వున్న జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు సహచరులు మృతిచెందారు. కాల్పులకు పాల్పడిన జవాన్ ఆ తరువాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అజిత్కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్తో తోటి సహచరలు గొడవకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన ఆ జవాన్ కాల్పులు జరిపాడు.