S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

మెహిదీపట్నం, మార్చి 24: కాచిగూడలో శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం కలిగించింది. 15మంది విద్యార్థులకు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నగరంలోని కాచిగూడ ప్రాంతంలో ఉన్న అంజుమాన్ హాస్టల్‌కు చెందిన విద్యార్థులు శనివారం రాత్రి తీసుకున్న ఆహారంలో ఫుడ్ పాయిజన్ జరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులను నిలోఫర్ ఆసుపత్రికి శనివారం రాత్రి తరలించారు. విద్యార్ధులు ఒకటి నుంచి ఆరో తరగతి చదువుతున్నారు. ప్రత్యేక వైద్యం చేస్తున్నట్లు నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. వీరిని సోమవారం మధ్యాహ్నం డిస్‌చార్జి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రికి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉండటంతో ఊపీరి పిల్చుకున్నారు.