ఏఐబీఎస్ఎస్ నూతన అధ్యక్షుడిగా శ్యాంనాయక్
Published Monday, 25 March 2019ఖైరతాబాద్: ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ( ఏఐబీఎస్ఎస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అజ్మిరా శ్యామ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం మింట్కాంపౌండ్లోని గిరిజన భవన్లో సంఘ్ తాత్కాలిక అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ అధ్యక్షుడు శంకర్ పవార్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో బంజారా కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు-సంఘ్ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించారు. ఈ అంశంపై సభ్యుల సలహాలు, సూచనలను తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్యామ్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు శంకర్ పవార్ ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షలకు పైగా ఉన్న బంజారాల సంక్షేమం కోసం సంఘ్ కృషి చేస్తుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన సంఘ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి విన్నవిస్తానని చెప్పారు.