మరో రెండు బ్లాక్లను తెలంగాణకు అప్పగించిన ఏపీ
Published Thursday, 20 June 2019హైదరాబాద్, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిధిలో హైదరాబాద్ సచివాలయంలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత బుధవారం రెండు బ్లాకులను అప్పగించారు. ‘కే’ బ్లాకుతో పాటు ‘నార్త్ హెచ్’ బ్లాకులను తెలంగాణకు అప్పగించారు. ఈ మేరకు రూపొందించిన అధికారిక లేఖపై రెండు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు.