భారత్తో సిరీసే ఆఖరిది
Published Thursday, 27 June 2019మాంచెస్టర్, జూన్ 26: వెస్టిండీస్ బ్యాట్స్ మన్ క్రిస్గేల్ రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని ప్రకటించాడు. స్వదేశంలో భారత్తో జరిగే వనే్డ, టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. గేల్ మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం ప్రపంచకప్ అనంతరం తాను క్రికెట్ నుంచి తప్పుకోను న్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. గురువా రం మాంచెస్టర్లో భారత్తో మ్యాచ్ నేప థ్యంలో మీడియాతో మాట్లాడాడు. తాను మనసు మార్చుకున్నట్లు తెలిపాడు. ఇది ఇప్పటికీ ముగిసినట్లు కాదు. ఇంకా కొన్ని మ్యాచ్లు ఆడతాను. మరో సిరీస్ కూడా ఆడొచ్చు. ప్రపంచకప్ తర్వాత భారత్తో జరిగే సిరీస్ ఆడతాను. టీ20లు ఆడను. ఇదే ప్రపంచకప్ తర్వాత నా ప్రణాళిక అని మీడి యాకు తెలిపాడు. ఈ ప్రకటనను విండీస్ మీడియా మేనేజర్ ఫిలిప్ స్పూనర్ ధ్రువీక రించాడు. గేల్ దేశం తరఫున స్వదేశంలో బారత్తో జరిగే సిరీసే చివరిదని స్పష్టం చేశాడు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ సిరీస్ జరగనుంది.
చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్