S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జంధ్యాల పూర్ణిమ

భారతావని మొత్తం శ్రావణ పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తుంది. ఏడాదికి ఒకసారి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లో శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) ధరించే వారందరూ ఈ రోజు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే ‘ ఉపాకర్మ’ అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యానే్న ‘యజ్ఞోపవీతం’ అని కూడా అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని ‘నూలి పున్నమి’ అన్నాడు. నూలుతో తయారుచేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్నవారిని ‘ద్విజులు’ అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం ‘జ్ఞానాధ్యయనం’ గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడుతుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమినాడు తీసి వేస్తారు. ఉపనయనం అయినవారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ జంధ్యాల పూర్ణిమ కేవలం ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు..
‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజా పతేః యత్ సహజం పురస్తాత్
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః’
అనే శ్లోకాన్ని పఠించి ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ కింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజః॥
ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తాలుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఒంటి ముడి ఉండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని ‘బ్రహ్మముడి’ అంటారు. యజ్ఞోపవీతాన్ని బ్రహ్మదేవుడు తయారుచేయగా లోకసంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయగా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. జంధ్యం నాభి వరకే ఉండాలి. నాభి కిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభి పైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.
జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా ఉంటే ధన హాని కలుగుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవుతాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు ఇవ్వడం మంచిది. గాయత్రీమాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ రోజు పనె్నండు సంవత్సరాల లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిస్తారు.