నకిలీ కరెన్సీ పట్టివేత
Published Friday, 13 May 2016జడ్చర్ల, మే 13: జడ్చర్లపట్టణంలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది.బంగ్లాదేశ్ సరిహద్ధు ప్రాంతంలోని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒముఠా నకిలీ నోట్లచెలామణి చేస్తూ జిల్లాలోకి ప్రవేశించింది. నకిలీ నోట్ల చెలామణిలో భాగంగా వివిధ ప్రాంతాలల్లో సంచరిస్తూ జడ్చర్లకు చేరుకున్నారు. ఈ నెల 8న పట్టణంలోని కొత్త బస్టాండ్లోని క్యాంటీన్లో ఆహారం స్వీకరించేందుకు కౌంటర్లో నకిలీ నోట్లను ఇచ్చారు. నోట్లను పరిశీలించిన సిబ్బంది అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు నలుగురి ముఠాలోని సభ్యుల్లో ఒకరు పట్టుబడగా మిగతా ముగ్గురు తప్పించుకుపారిపోయారు. తమకు దొరికిన నిందితున్ని విచారించిన పోలీసులు రంగంలోకి దిగి కేవలం నాలుగురోజుల వ్యవధిలోనే ముఠా గుట్టును రట్టు చేశారు. డిఎస్పీ కృష్ణమూర్తి ఈసంఘటనకు సంబించిన వివరాలను శుక్రవారం పోలీసు స్టేషన్లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హరుణ్ మరో నలుగురితో కలిసి నకిలీ నోట్ల చెలామణి చేయడం ప్రారంభించారు. జడ్చర్ల లో హరుణ్ సహచరులు ఎనాముల్ మిట్టుశేక్,తహారి ఉల్ హాలాం,ఆథర్ శేక్,ఉస్మాన్ ఘని కొత్త బస్టాండ్ క్యాంటీన్లో నకిలీ నోట్ల చెలామణికి పాల్పడ్డారు. ఈసమయంలో అనుమానం వచ్చిన క్యాంటిన్ సిబ్బంది స్థానిక ఎస్సై జమ్ములప్పకు సమాచారం అందించగా పోలీసులకు ముఠా సభ్యుల్లోని ఒక్కరు పట్టుబడగా మిగతా ముగ్గురు పారిపోయారు. పట్టుబడిన నిందితుడిని విచారించిన పోలీసులు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తప్పించుకు పారిపోయిన మిగితా నిందింతులను హైద్రాబాద్లోని ఇసిఐల్ ప్రాంతంలో పట్టుకున్నారు. నోట్లను హైక్వాలిటీ ఇండియన్ ఫేక్ కరెన్సీ అని,ముబారక్ అనే వ్యక్తితో రూ.30వేలకు లక్ష రుపాయల నకిలీ కరెన్సీ తీసుకుని ఇలాంటి వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. పట్టుబడిన నిందితుల నుండి రూ.80వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో సిఐ గంగాధర్,సిబ్బంది పాల్గొన్నారు.