ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో తల్లీబిడ్డలకు ట్యాగ్
Published Saturday, 16 July 2016గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే బిడ్డల సంరక్షణకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ )ట్యాగ్ పథకాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం గుంటూరు ఆసుపత్రిలో ప్రారంభించారు. ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి అని కామినేని తెలిపారు. ప్రసవం కోసం రాగేనే గర్భిణికి ట్యాగింగు చేసి ఒక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని, కాన్పు తర్వాత ఆమె బిడ్డకు మరో సంఖ్యను ఇస్తామని తెలిపారు. ప్రసూతి విభాగం నుంచి పసిబిడ్డను బయటకు ఎవరైనా తీసుకువెళ్తే శబ్ధం చేస్తూ సంకేతం వస్తుందన్నారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.