గవర్నర్ను కలిసిన పెమా ఖందు
Published Saturday, 16 July 2016ఇటానగర్: కొద్దిగంటల్లో అసెంబ్లీలో బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్ టుకి కాంగ్రెస్ శాసనసభా పక్షనేత పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సిఎల్పి నేతగా ఎన్నికైన పెమా ఖందు శనివారం రాష్ట్ర గవర్నర్ తథాగత రాయ్ను కలిసి తాను సిఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమేనని, తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు మెజారిటీ ఉందని తేలితే ఖందు సిఎం పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది.