ఎపి ప్రయోజనాలే ముఖ్యం: మేకపాటి
Published Saturday, 16 July 2016హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా పార్లమెంటులో తమ గళం విప్పుతామని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుపోయి రాష్ట్రానికి మంచి జరిగేలా కృషి చేస్తామన్నారు. విభజన చట్టంలో హామీలు, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ఏర్పాటు, కేంద్రం నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై తమ ఎంపీలు పోరాడతారని ఆయన ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి తన పార్టీ ఎంపీలతో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం చర్చలు జరిపారు.