చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మావోల మృతి
Published Saturday, 16 July 2016రాయ్పూర్: చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా తమ్రెల్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా తారసపడిన మావోలు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నలుగురు మావోలు మరణించారు. మిగతా మావోయిస్టులు పరారయ్యాక సంఘటన స్థలంలో తుపాకులు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.