S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభ్యాస వైరాగ్యంతోనే జ్ఞానార్జన ( అమృత వర్షిణి)

పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులట ఇందరిలో
పరమాత్ముడు వెలిగే
గగనానిల తేజో జల భూమయమగు
ఖగమృగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగ రాజాది ఆశ్రీతులలో పరమాత్ముడు వెలిగే
త్యాగరాజ కీర్తనల్లో విద్యార్థులు నేర్చుకునే దశలో పాడేవి కొన్నీ, విద్వాంసులు మాత్రమే పాడేవి కొన్నీ ఉన్నాయి - అందరూ పెద్దపెద్ద కీర్తనలు పాడలేరు.
వయసుతో బాటు మనసు పరిపక్వం చెందాలి. పరిణతి రావాలి. రాగభావాన్ని అనుభవించే దశకు వస్తేనే కొన్ని కీర్తనలు వినే వారి హృదయాలకు తిన్నగా చేరతాయి. ప్రతి పదమూ రాగంతో నింపగలుగుతూ పాడే అనుభవం సంపాదించినప్పుడే ఈ కీర్తన యొక్క గొప్పతనం తెలుస్తుంది.
ఇటువంటి కీర్తనలు త్యాగయ్యవి ఎన్నో ఉన్నాయి. సరళమైన మాటలతో గంభీరమైన వేదాంతార్థాన్ని రాగంతో నింపేస్తూ, పరమాత్ముణ్ణి దర్శించిన వాగ్గేయకారుడు త్యాగయ్య.
భావం శబ్దమై మాటలై, వాక్యంగా పరిణామం చెంది వినేవారికి తాదాత్మ్య స్థితిని కల్పించటంలో వాగ్గేయకారుల మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో, బాలాంత్రపు రజనీకాంతరావు విశే్లషిస్తూ, చెప్పిన మాటలు గమనించండి - మూలాధార చక్రం - ఆసన స్థానంలో ఉంటుంది - జననేంద్రియ స్థానంలో స్వాధిష్టాన చక్రం ఉంటుంది. నాభి దగ్గర మణిపూరక చక్రం, హృదయం దగ్గర అనాహత చక్రం, ఆపైని కంఠంలో థైరాయిడ్ గ్లాండ్ దగ్గర విశుద్ధి, ఈ నాలుగు చక్రాలూ మనిషి నాడీ మండల క్షేత్రానికి అనుసంధానమై ఉంటాయి.
ఈ చక్రాలకు పైని కనుబొమ్మలు మధ్య సుఘుమ్న వద్ద ఆజ్ఞా చక్రమనీ, నడినెత్తిన మాడుపట్టు వద్ద సహస్రార చక్రం ఉన్నాయి. దీన్ని అంటిపెట్టుకుని తలలో పెద్ద మెదడూ, దాని కింద ముచ్చెలగుంట వరకూ చిన్న మెదడూ ఉంటాయి.
ఈ మెదడు భాగాల నుంచి దేహంలో అన్ని అవయవాలకూలాగే, ముందు చెప్పిన ఆరు చక్రాలకూ నాడీ తంతువులు అల్లుకుని ఉంటాయి. ఇదంతా ఒక టెలిగ్రాఫిక్ నెట్‌వర్క్‌లా ఉంటాయి. (నెర్వస్ సిస్టమ్)
మూలాధార చక్రం నుంచి నాభి దగ్గర మణిపూరక చక్రం వరకూ మినుకు మినుకుమంటూ ఓ వెలుగులో భావతరంగాలు రూపరహిత స్థితి నుంచి పశ్యంతీ దశకు చేరితే అలా ఏర్పడిన భావాలకు అర్థం ద్యోతకమయ్యే పరిణామం కలుగుతుంది.
మూలాధారం నుంచి సహస్రారం వరకూ వ్యాపించిన వెన్నుపాము అనే కుండలిని ద్వారా ‘ఓంకారం’ ఏ తంత్రీ మీటకుండానే మోగుతుంది. త్యాగరాజు వంటి నాద తపస్వులూ, యోగాభ్యాస సిద్ధులూ, ఆ ప్రణవ నాదాన్ని వినగలిగేవారు. రజనీ దీనికి మరింత వివరణ ఇస్తూ, ఒక్కొక్క చక్రం దగ్గర కొన్ని మంచి గుణాలు, మరికొన్ని చెడ్డ గుణాలు, మంచి భావాలు, చెడు భావాలు కలిగించే రేకులుంటాయి.
అందుకే అనాది నుంచి చెడు నుంచి మంచికీ, అసత్తు నుంచి సత్తుకూ, తమస్సు నుంచి జ్యోతికీ, మృత్యువు నుంచి అమృతత్వానికీ మేలుకొలుపమని వేదర్షుల భావన.
తొలి దశలో వున్న పరావాక్కుకు నిలయమైన స్థితిలో మనుష్యులందరికీ అంతరాత్మ అనదగిన ‘పరమాత్మ’ వెలుగుతూ ఉంటుంది.
అలా వెలిగే ‘ఆ పరమాత్మ’ను దర్శించిన త్యాగయ్యకు కనిపించిన రాగదేవత వాగధీశ్వరి.
మార్పు లేకుండా నిత్యం ప్రకాశించే ‘సూర్యకాంతి’ లాంటిది ఆత్మప్రకాశం. రోజూ మారిపోయేది ప్రపంచం. ఆత్మ ప్రకాశింపని సమయం ఉండదు. దానికి రాత్రింబగళ్లు లేవు. మన జీవితాలకు ఈ ఆత్మే సాక్షి.
‘అంతరంగ మెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
వింత వింత విధముల వీడు నా బంధములు’
అంటాడు అన్నమయ్య.
మనం ఏదో తెలివైన వాళ్లమనుకోవడం పెద్ద పొరబాటు. పొట్టకూటి కోసం క్షణక్షణమః తడుముకుంటూ ఉండటం వరకే మన తెలివితేటలు.
ఎన్ని కళలైనా నేర్వవచ్చు. శాస్త్రాలు తెలియవచ్చు. ప్రపంచంలో ఎక్కడెక్కడికైనా తిరిగి జ్ఞానాన్ని పోగేసుకోవచ్చు. ఎనె్నన్ని ఘన కార్యాలైనా సాధించవచ్చు. ఉన్నతోద్యోగాలు చేయవచ్చు. లేదా పెద్దపెద్ద పదవులు సంపాదించవచ్చు. ఎన్ని పుణికింతాలు పడ్డా పర్యవసానం ఒక్కటే.
అన్నీ మాయా సంసారానికి, జీవన విధానానికీ ఉపోద్ఘాతాలే. సంసార ధర్మాలే. అవసరాన్నిబట్టి అనేక అవతారాలెత్తుతూ ఉంటాయి. ఆద్యంతాలుండవు. ఇలా జీవితం అంతా, అంతర్మథనంతో, అంతులేని సమస్యలతో, ఆవేదనలతో, ఆరాటాలతో, సర్కస్‌లో జెయింటు వీలు భ్రమణమే. అసలు తెలివి ఇది కాదు. అన్నమయ్య భావన కూడా ఇదే.
‘ఎటు పుట్టించితో నీ వెరుగుదువుగా?
ఘటనలన్నియు నీ సంకల్పమే నయ్యా!’ అంటూ-
‘చచ్చేవారిని చూచి చావుకు వెగతును గాని
రొచ్చుల సంసారముపై రోతును గానీ
కచ్చుపెట్టి అదియే కాలాచేత పెనగగా
మచ్చిక సేయుదుగానీ మానలేనయ్యా’ అని వాపోతాడు.
సంపద పెంచుకున్నంత సునాయాసంగా వైరాగ్యం అస్సలు పెరగదు. ఆర్థిక అసమానతను పారద్రోలాలని గొంతు చించుకునే వాళ్లకు అసలు వైరాగ్య వాసనలుండవు. ఒచ్చిన పనేమిటో తెలుసుకుని యుక్తితో నెరవేర్చుకుని బాటసారిలా సత్రంలోంచి అవతలకు పోయేవాడే బహు నేర్పరి. వాడే తెలివైన వాడు. ఇక్కడెన్నాళ్లున్నా, అద్దె కొంప బతుకే అనే భావం పొరబాటున ఓ పదిమందికి పుట్టిందా? దేశమే బాగుపడుతుంది.
నాలుగు పదులు నిండకుండానే ప్రపంచాన్ని చదివేసిన ఆదిశంకరాచార్యులు, వివేకానందుడు లాంటి వారి బోధనల సారాంశం ఇదే. ఒక్కటే - సత్యాన్ని నాలుగు రకాలుగా చెప్తారంతే.
సద్గురువులెప్పుడూ జ్ఞాన ధనాన్ని పుష్కలంగా సంపాదిస్తారు. మాయ ధనం కాదు - ఇవ్వాలన్నా వాళ్ల దగ్గర ఉండదు. మాయ ధనాశతో ఈ మాయ లోకంలో ఎన్నాళ్లు జర్జర దేహాలు ఈడ్చుకుంటూ బ్రతికినా రావల్సినది తత్త్వ జ్ఞానం. అదే శరణాగతి. సిద్ధులైన పరమ గురువులు శతాబ్దాల తరబడి చేయవలసిన లోక శ్రేయస్సు ఎంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో చేసేస్తారు. నిద్రపోయి లేచిన వాడు నిన్నటి పని ఎలా పూర్తి చేస్తాడో గురువులు చేసే పని కూడా అలాగే ఉంటుందని అనుభవజ్ఞులు చెప్పే మాట.
వెయ్యి సంవత్సరాలు గిజగిజలాడినా, స్థాన బలం లేని గజేంద్రుణ్ణి కాపాడినట్లు జుట్టు పట్టుకుని పైకి లేవదీసేవాడు ఆ పరమాత్ముడు.
ఒక్క మాటలో మనలను కాపాడేది ఒక్క శరణాగతి మాత్రమే అని నిర్ద్వందంగా చెప్పేశారు మన వాగ్గేయకారులు.
మనం సంపాదించిన ధనం గానీ, యవ్వనంగానీ, పదవులు గానీ, మందీ మార్బలంగానీ, ఎందుకూ కొరగావు. అంతరాత్మను పక్కన పెట్టేస్తే, ఎంత పాండిత్యమున్నా విద్య, గర్వాహంకారాలు తమకంటే ముందుండి పతనానికి మార్గాన్ని చూపిస్తాయి. ఆదర్శం లేని జీవితం, తత్త్వం తెలియని జీవన విధానం, అర్థం తెలియని చదువులు వ్యర్థం కాక ఏమవుతాయి? ఉదర పోషణకేనా చదువులు? ఆ పరతత్త్వం తెలుసుకునే వరకే ఈ చదువులు.
తెలుసుకున్న తర్వాత ఏ చదువులూ అక్కర్లేదు. అందుకే తత్త్వమెరుగ తరమా! పర తత్త్వమెరుగ తరమా! అన్నాడు త్యాగయ్య.
పరమార్థ దృష్టి లేక ఏవేవో అభినయాలు, ఆడంబరాలు చూపిస్తూ కేవలం ధనం మీద వ్యామోహంతో క్రిందా, మీదా పడుతూ, ఉన్నది చాలక, ఇంకా ఏదో కావాలనీ, మరేదో సంపాదించాలనే ఆశతో కొట్టుమిట్టాడటం తప్ప మాయా సంసారం అని తెలియకపోతున్నాం. మోహాంధకారంతో తిరిగేస్తున్నాం’ అంటూ శంకర భగవత్పాదులు ఎప్పుడో చెప్పేశారు. ‘కాంతే కాంతా కస్తే పుత్త్రః, సంసారో యమతీవ విచిత్రః’
కస్యత్వం కుత ఆయాతః
తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః’
బ్రహ్మచారిగా బ్రతికి, సంసార భ్రమణాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించిన మహానుభావుడు కాదూ?
మనిషిగా పుట్టి, వయసు పెరుగుతున్న కొద్దీ, లోకానుభవాన్ని బట్టి సహజంగా విజ్ఞానం పెరుగుతుంది. పెరగాలి. ఉన్నత స్థానంలో హుందాగా ఉండవలసింది పోయి, మాయలోంచి విడుదలవలేక మోహాన్ని పెంచుకునేందుకే ఉబలాటపడతాడు మనిషి. బంగారం మోసే గాడిద చూపులెప్పుడూ గడ్డిపరకలపైనే ఉంటుంది. ‘ఒసేయ్ ఖరమా! గుర్రాలు దొరక్క నీ అదృష్టం కొద్దీ మోసే అవకాశం వచ్చిందే? తప్పు సుమా?’ అంటే అర్థమై ఛస్తుందా? మానవ స్వభావమూ అంతే. కట్టుకుపోతామా? మరేం ఫరవాలేదు అంటూంటారు. కానీ అదేమి చిత్రమో? స్వభావంలో మార్పేమీ ఉండదు. అదీ గమ్మత్తు.
అన్యాయార్జితం మహా అయితే ఓ పదేళ్లుంటుంది. ఆ తర్వాత దాచుకున్నదీ దోచుకున్నదీ మొత్తం సమూలంగా పోతుందంటారు విజ్ఞులు. ‘ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా!
లోపల వున్న పరమాత్ముడన్నీ గమనిస్తూంటాడు. కనబడేదంతా నశించేదే - కనబడని ఆత్మ ఒక్కటే శాశ్వతం అనేది శాస్త్ర ప్రమాణం. పరమాత్ముడు లేని చోటేది? సర్వే సర్వత్రా వాడే. అందుకే శాశ్వతాత్మను ఆశ్రయిస్తే కల్తీలేని ఆనందం లభిస్తుంది. శాశ్వతం కాని శరీరాన్నీ, ప్రపంచాన్నీ నమ్మితే దుఃఖమే. మనసా! పరమాత్ముడనేవాడు నీలోనే వున్నాడు. నీతోనే వున్నాడు. పరిపరి విధాలుగా పరిగెట్టే మనసును కట్టడి చెయ్యి. దాన్ని ఇష్టం వచ్చినట్లు బయటకు తిరగనీయకు. అంతర్ముఖం చేసుకో. లోక వ్యవహారాలు పెంచుకుని ఏమిటి సాధించేది?
నీకేదైతే ప్రతికూలంగా కనిపిస్తుందో, దాన్ని ఇతరులకు చేయకు - అంతే. అదే నీతి. అదే ధర్మం. నువ్వనుభవించేదంతా అదిగో! ఆయన చలవే. నీదంటూ లేదిక్కడ. బాగా తెలుసుకో. భగవంతుడికి శరణాగతుడవై తామరాకు మీద నీటిబొట్టులా ఉండు.’
నాహం కర్తా, హరిఃకర్తా’ అనుకుంటున్నంత వరకూ నీకు ఢోకా లేదు అంటారు సద్గురువైన త్యాగయ్య.
‘నా అభిప్రాయమూ, మా ఆవిడ అభిప్రాయమూ ఎప్పుడూ ఒక్కటే. మాలో తేడా లేదు’ అనే వాడికి బాధల్లేవు. ప్లీడర్లకు పనే లేదు. కోర్టులక్కర్లేదు. మొత్తం చిక్కు అంతా రెండు రకాల అభిప్రాయాల వల్లే.. ఉంటే ద్వైతం అవుతుంది. రెండుంటే దెబ్బలాటలే.
మంత్రం కాని మాట ముందుకు రాని మొక్క ఉండవు. ఆ కాస్తా తెలిస్తే మోక్షము, తెలియకపోతే బంధమే. పాటకు ఒదిగిన మాటలు, మనస్సుకు పట్టే భావాలు నిండిన కీర్తనలు ఎప్పుడు పాడినా ఆనందాన్ని నింపేస్తాయి- ఈ లోకంలో జరిగే వ్యవహారాలన్నీ మనల్ని పుట్టించిన వాడికే తెలుసు. అభ్యాస వైరాగ్యంతో గానీ జ్ఞానం దొరకదు. ఆత్మచైతన్యం ఉనికిని పట్టుకుంటే తప్ప భక్తి ఏర్పడదు. భక్తి లేని జ్ఞానం ఒంటరిగా నిలబడదు. ఈ భక్తి సూత్రాన్ని నాదబంధంతో ముడివేశాడు త్యాగయ్య. ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అనే్నసి మనస్తత్వాలున్నాయి. కానీ పరమాత్మ తత్త్వాన్ని గ్రహించేవారు మాత్రం ఇలా కొందరే ఉంటారు. అందుకే వారు సద్గురువులు.
****
కపిలవాయ హోటలు.. పాటలు!

స్పందన

మృతవర్షిణి’ శీర్షిక క్రింద ప్రచురించిన ‘నట గాయకుల పద్య పట్ట్భాషేకం’ (్ఫబ్రవరి 5, 2017) వ్యాసం అద్భుతంగా ఉంది. అందులో కపిలవాయి రామనాథశాస్ర్తీ పద్యాల గ్రామఫోను రికార్డులు నిత్యం హోటళ్లలో వినిపించేవన్నారు. నిజానికి అప్పుడు అతని పేరుమీదే ఒక హోటలు ఉంది. రావూరి సత్యనారాయణరావు గారు ‘వంద చందమామలు’ అనే పేరుతో వ్రాసిన పుస్తకంలోని ఈ ప్రస్తావన ఇక్కడ తప్పక చెప్పుకోవాలి.
అప్పుడు పెడన (కృష్ణాజిల్లా)లో కపిలవాయి హోటల్ ఉన్నదనే సంగతి కపిలవాయి రామనాథశాస్ర్తీగారికి తెలియజేశాను. శాస్ర్తీగారు చాలాసేపు నవ్వుకున్నారు.
ఆ హోటలులోకి ప్రవేశించి ఓ మూల కూర్చున్నాం. ‘ఒక చౌక బేరం’ అని కొందరు, ‘రాముని వంటి కొడుకు’ అని కొందరు ఇలా కేకలు వెయ్యడం విన్నాం. సర్వరు వచ్చాడు. ‘‘రెండు కప్పుల కాఫీ, కపిలవాయి’’ అన్నారు శాస్ర్తీగారు. ‘‘అలా అంటే ఎలా? ఏ పాట కావాలో చెప్పండి. అన్నీ ఆయనగారి పాటలే. మూడు సెట్లు అరిగిపోయాయి. నిన్ననే క్రొత్తది వచ్చింది. ఏది కావాలి?’’ అన్నాడు. శాస్ర్తీగారు మళ్లీ ‘కపిలవాయి’ అన్నారు. సర్వరు విసుక్కున్నాడు. నేను చెప్పాను. ‘‘ఆయన పాడింది ఏదైనా సరేనట. అన్నీ ఆయనగారికి యిష్టమేనట’’ అని. ‘‘అయితే వేరే మేం పెట్టడమెందుకు? అదిగో వినండి’’ అని కాఫీ తెచ్చాడు. ఆ పాటలన్నీ వింటూ శాస్ర్తీగారు తన్మయులయ్యారు.
అప్పుడు నావంక చూసి, ‘‘సత్యనారాయణగారూ, మీరు నాకు ఇవ్వాళ గొప్ప సన్మానం చేశారు. ఎన్నో జరిగాయి. కాని ఇలాంటిది జరగలేదు. నా సంగీతం మీద ఇంత ప్రీతిగలవారు ఇక్కడ ఉండటం, పాట వింటూ ఫలహారాలు చెయ్యడం ఎంత గొప్పగా ఉంది. నా పాటలన్నీ ఇలా ప్రచారం చేసినందుకు హోటల్ యజమానిని నేను అభినందించాలి’’ అన్నారు కపిలవాయి రామనాథశాస్ర్తీగారు, రావూరు సత్యనారాయణగారితో. నాటక పద్యానికి ఇంతకుమించిన పట్ట్భాషేకం లేదు.
ఆ వ్యాసంలో ఇంకొక రెండు మూడు పేర్లు బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వరరావు వంటి వారివి కూడా చేర్చి ఉంటే నా దృష్టిలో ఆ వ్యాసం పరిపూర్ణం అయ్యేది. ఆ వ్యాసాన్ని ప్రచురించినందుకు అభినందనలు.

- కణుగుల వేంకటరావు, శ్రీకాకుళం

- మల్లాది సూరిబాబు 9052765490