S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2020 - 19:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో ముగుస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశాలున్నాయ. కరోనా వైరస్‌ను కట్టడి చేస్తూనే లాక్‌డౌన్ కారణంగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండంచెల విధానాన్ని అవలంబించవచ్చునని అంటున్నారు.

04/14/2020 - 04:35

వికారాబాద్: అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప జనం బయటకు రావద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యవసర వస్తువులను ప్రజల ఇళ్ల వద్దకే పంపే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణను ఆదేశించారు.

04/14/2020 - 04:33

విజయవాడ: గత 20రోజుల క్రితం స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారిమళ్లించి ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు, కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేని దుస్థితికి తీసుకురావద్దని కోరుతూ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

04/14/2020 - 04:30

వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మడికొండ లేదా ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.

04/14/2020 - 04:27

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నపూర్ణ కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వలస కూలీల పరిస్థితుల పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వాలన్నారు.

04/14/2020 - 04:25

హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో ప్రవేశపరీక్షలకు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే గడువును మే 5వ తేదీ వరకూ పొడిగించగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్ 17వ తేదీ వరకూ పొడిగించారు.

04/14/2020 - 04:24

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని వైన్‌షాప్‌ల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అంశాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటి వరకు అక్రమంగా మద్యం అమ్మిన వారిపై 675 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉన్నాతాధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.

04/14/2020 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో లాక్‌డౌన్ అమలు జరుగుతున్నందున గత సంవత్సరం మార్చి నెల బిల్లులనే ఈ ఏప్రిల్‌లో చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నందున వాటికి సంబంధించిన బిల్లులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు.

04/14/2020 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 13:కరోనా వ్యాధి బాధితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపధికన ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు అందించే వైద్య సదుపాయ ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ ఆసుపత్రిని పరిశీలించారు.

,
04/14/2020 - 04:03

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా గోదావరి జిల్లాలు కర్ఫ్యూ వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఉదయం 11 గంటల వరకూ నిత్యావసరాల కోసం వస్తున్న వారితో కాస్త జన సంచారం కనిపిస్తున్నప్పటికీ, ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Pages