S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కళాంజలి
శ్రీమతి లక్ష్మీకృష్ణగారు పవిత్ర కృష్ణానదీ తీరంలో విజయవాడలో 17 అక్టోబర్ 1954లో జన్మించారు. వీరు ప్రఖ్యాత వీణ, సంగీత విద్వాంసురాలు. స్వయంగా వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత. ఎన్నో అవార్డులు పొందారు. హైదరాబాద్లో ‘శ్రీ విశ్వవాణి మ్యూజిక్ స్కూలు’ 1994లో స్థాపించి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, వీణ నేర్పిస్తూ కళాసేవ చేస్తున్నారు. వీరు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ భక్తురాలు.
ప్రస్థానం
డా.శ్రీదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి. ఎన్నో దశాబ్దాలుగా కళాసేవకే అంకితమయ్యారు. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘యక్షగానం - ప్రదర్శనా రీతులు’ అనే పరిశోధనాంశం మీద పిహెచ్.డి. జానపద కళల విభాగం నుండి 2007లో పొందారు. ఇందులో చిందు యక్షగానం, కూచిపూడి యక్షగానం, కర్ణాటక యక్షగానం, తంజావూరు యక్షగానం, మేలట్టూరు భాగవత మేళ నాటకములపై పరిశీలన చేశారు.
శ్రీమతి రాధిక కోడిమాల ప్రఖ్యాత కూచిపూడి నర్తకి. సంప్రదాయ కూచిపూడి నృత్యంతోపాటు కథక్, జానపదం, లలిత సంగీతంలో నిష్ణాతురాలు. శ్రీమతి రాధిక బహుముఖ ప్రజ్ఞాశాలి. తల్లిగా, గృహిణిగా, వ్యక్తిగతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ, కొన్ని దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. ‘కురుగంటి కళాక్షేత్రం’ స్థాపించి నృత్యం నేర్పుతూ ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు.
యోగా చేయడంవల్ల శరీరం, మనస్సు, ఆత్మ, బుద్ధి శక్తివంతం, పటిష్టం అవుతాయి. యోగ అంటే ఒక జీవన విధానం. ఒక ప్రయాణం. ప్రగతిబాట అంటారు ప్రఖ్యాత యోగ గురువు సునీతా జైస్వాల్. గృహిణిగా, తల్లిగా, యోగా గురువుగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వీరికి యోగ అంటే చెప్పలేని ఇష్టం. సరస్వతీ వాసుదేవన్ గారి వద్ద యోగ నేర్చుకున్నారు. ఈయన చెన్నైలో ప్రఖ్యాత యోగా గురువు.
డా.పసుమర్తి శేషుబాబుగారు ప్రఖ్యాత కూచిపూడి నర్తకులు, గురువు, సంగీత విద్వాంసులు. దేశ విదేశాలలో 2000 పైగా ప్రదర్శనలిచ్చి, కూచిపూడి కీర్తిపతాక నెగురవేశారు. ఎన్నో ముఖ్యమైన సంగీత, నృత్య పరీక్షలకు ఎగ్జామినర్గా వెళ్తూంటారు. కూచిపూడి నృత్య భారతి 1985లో హైదరాబాద్లో స్థాపించి, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. సిసిఆర్టి ప్యానల్ జడ్జిగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు.
శ్రీమతి కందాళ రోహిణి ప్రఖ్యాత నర్తకి, పరిశోధకురాలు, గురువు. వీరు కూచిపూడి, భరతనాట్యం రెండింటిలో నిష్ణాతులు. తల్లిగా, గృహిణిగా, ఒకవైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో పిహెచ్.డి. చేస్తున్నారు.
వేముగంటి శ్రీ్ధరాచార్య ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. ఘటం, కంజీర, మోర్సింగ్, కోలు, చండి, తబలా మొదలగు ఎన్నో వాయిద్యాలతోపాటు మృదంగం కూడా వాయిస్తారు. 12వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్లో ఎంతో మంది ప్రఖ్యాత నర్తకుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫుల్టైమ్ సంగీత విద్వాంసునిగా అవక ముందు హైదరాబాద్ పాతబస్తీలో గుడిలో అర్చకునిగా ఉండేవారు. కళ కూడా పూజే!
అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా
పంచ కన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశినః
అర్థం: అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరీ అనే ఈ పంచ కన్యలను ఎల్లప్పుడూ స్మరించుకుంటే మహా పాపాలు నాశనమవుతాయి.
కృషి, పట్టుదల, నిరంతర పరిశ్రమ, భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు, కష్టనష్టాలను సమాన దృష్టితో చూడగలిగే మనోస్థైర్యం కలవారు జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుతారు. తాము అభివృద్ధిలోకి రావడమే కాదు తమ తోటివారి అభివృద్ధికి కూడా బాటలు నిర్మిస్తూ ముందుకు సాగుతారు.
డా. విజయ్పాల్ పాత్లోత్ ప్రఖ్యాత నర్తకుడు, గురువు, పరిశోధకుడు, రచయిత. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖలో 2009 నుండి బోధిస్తున్నారు. వీరి నృత్య శిక్షణాలయం- ‘పాత్లోత్ కళాక్షేత్ర’. ఇందులో దీక్షతో నేర్చుకునే విద్యార్థులకు నృత్యం నేర్పిస్తున్నారు.