S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2020 - 06:41

ఈ చిన్న యుద్ధానికే తాను విపరీతమైన పన్నులు వేసి, ప్రజల్ని పిండి, అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ప్రజల్ని ఇంకా పిండేందుకైనా వారి దగ్గర ఏమీ లేదని తెలుసు. అసలు ప్రాచ్య దేశాల యుద్ధమే మానుకోమనే ప్రజాభిప్రాయం తనకు అడ్డంకి కావచ్చు. ఈ సమస్య తేలుతే, తన ఏక ఛత్రాధిపత్యం తథ్యమైనట్టే!

03/23/2020 - 06:37

హైదరాబాద్, మార్చి 22: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు కోటిన్నర జనాభా అలరారుతున్న హైదరాబాద్ మహానగరం మూగబోయింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలకడం విశేషం. పేద, మధ్య తరగతి, ధనిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంటికే పరిమితమయ్యారు.

03/23/2020 - 06:31

నెల్లూరు, మార్చి 22 : కోవిడ్-19 (కరోనా వైరస్)ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఈ స్వీయ నిర్బంధం కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు.

03/23/2020 - 06:29

పిఠాపురం, మార్చి 22: ఒక పక్క కరోనా మహమ్మారికి అందరూ వణికిపోతుంటే పిఠాపురంలో ఓ కుటుంబం విదేశాల నుండి వచ్చిన వధూవరులకు వివాహం జరిపించడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అధికారులు రంగప్రవేశం చేయడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

,
03/23/2020 - 06:27

కర్నూలు/అనంతపురం/కడప, మార్చి 22: కరోనా (కొవిడ్-19)వైరస్ ప్రస్తుతం దేశంలో 2వ దశలో వుందని, ఈ వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు.

03/23/2020 - 06:23

తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరునగరిలో భక్తుల గోవింద నామస్మరణలు లేవు. వాహనాల శబ్ధాలు లేవు....రైలు కూతలు లేవు.వీధుల్లో జనసంచారం లేదు. దుకాణాలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో వ్యాపార వాణిజ్యాలు నడవలేదు. ఏ వీధిచూసినా, ఏ వాడ చూసినా రోడ్లు నిర్మానుష్యంగా మారి తిరుమల, తిరుపతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా అని ఏ సూర్యగ్రహణమో పట్టలేదు. రాజకీయ నాయకులు బంద్‌కు పిలుపునివ్వలేదు.

03/23/2020 - 06:20

హైదరాబాద్, మార్చి 22: ప్రపంచానికే జనతా కర్ఫ్యూ స్పూర్తి దాయాకమని, దేశ చరిత్రలలోనే ఆపూర్వమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతొ జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతంగా కోనసాగిందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ పూర్తి మద్దతు తెలిపారన్నారు.

03/23/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహామ్మారిని స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను దూరంచేయవచ్చునన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో విజయవంతం చేశారు. ఇటు మంత్రులు, అటు అధికారులు జనతా కర్ప్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సంకేతాలు ఇచ్చారు.

03/23/2020 - 06:14

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు. నిపుణుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులను ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. ‘కరోనా లక్షణాలున్న వ్యక్తులెవరైనా మీ సమీపంలో ఉంటే అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ..

03/23/2020 - 06:13

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై ఈవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చితిలోనే లావాదేవీలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 4,187.52 పాయింట్లు (12.27 శాతం) పతనమైతే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1,209.73 పాయింట్లు (12.15 శాతం) నష్టపోయింది.

Pages