S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 21: నోట్ల రద్దుకు సంబంధించిన కేసులన్నిటినీ ఒక హైకోర్టుకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ నెల 23న (బుధవారం) విచారించనుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 21: పార్లమెంటు ఉభయ సభలు నాలుగోరోజు సోమవారం కూడా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే గొడవలు, గందరగోళం మధ్య మంగళవారానికి వాయిదాపడ్డాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం మూలంగా లోక్సభ రెండుసార్లు వాయిదా పడితే, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడిన అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడక తప్పలేదు.
బంగర్వౌ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 21: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కలల ప్రాజెక్టు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ హైవే సోమవారం ప్రారంభమయింది. భారత వాయుసేన (ఐఎఎఫ్) యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ హైవేను సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదినమైన నవంబర్ 21న ప్రారంభించడం విశేషం.
న్యూఢిల్లీ, నవంబర్ 21: దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)లో ప్రాంతీయ సహకారానికి తీసుకునే ప్రతి చర్యను అడ్డుకుంటున్న పాక్ వైఖరిని భారత్ తీవ్రంగా దుయ్యబడ్తూ, దీనివల్ల ఈ ప్రాంతంలోని దేశాలు ‘బిమ్స్టెక్’లాంటి ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కునేలా చేస్తుందని హెచ్చరించింది.
లక్నో, నవంబర్ 21: సంకీర్ణానికి సమాజ్వాది నేత ములాయం నో చెప్పటంతో ఉత్తరప్రదేశ్లో జనతా పరివార్ కొత్త కూటమికి తెరలేపింది. రాష్ట్రీయ లోక్దళ్, యునైటెడ్ జనతాదళ్లతోపాటు మరో స్థానిక పార్టీ కూటమిగా ఏర్పడుతున్నట్లు ఆరెల్డీ అధినేత అజిత్సింగ్ సోమవారం ప్రకటించారు. తమ కూటమి రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: గర్భాన్ని అద్దెకిచ్చే విధానం (సరోగసీ) వ్యాపారమయం కావడాన్ని నిరోధించే బిల్లును కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ఆకస్మికంగా రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే సరోగసీ (నియంత్రణ) బిల్లు-2016ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు.
కోచి, నవంబర్ 21: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం పేరు మారింది. శబరిమల శ్రీ ధర్మ శాస్త్ర ఆలయం పేరును శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంగా మార్చినట్టు ఆలయ పరిపాలన విభాగం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డునుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దట్టమైన అడవుల్లో అయ్యప్ప స్వామి వేంచేశారు. ఆలయం పేరు మారుస్తూ గత నెల 5న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఓ వైపు భారీ క్యూలు ఉంటుండగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వంలోని గ్రూపు-సి ఉద్యోగులు సోమవారంనుంచి తమ నవంబర్ నెల జీతంలో పది వేల రూపాయల నగదును అడ్వాన్స్గా తీసుకోవడం ప్రారంభించారు. హోం మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న దాదాపు వెయ్యి మంది గ్రూప్-సి ఉద్యోగులకు కూడా పది వేల రూపాయల నగదును వేతన అడ్వాన్స్గా చెల్లించారు.
ఢెంకనాల్, నవంబర్ 21: ఒడిశాలోని ఢెంకనాల్లో ఉన్న రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ శాఖనుంచి 1.15 కోట్ల రూపాయల విలువైన రద్దయిన వెయ్యి, 500 రూపాయల నోట్లను దోచుకుపోయారని పోలీసులు సోమవారం తెలిపారు. శని, ఆదివారాలు సెలవుల అనంతరం సోమవారం బ్యాంక్ను తెరిచినప్పుడు ఈ దోపిడీ వెలుగులోకి వచ్చిందని టౌన్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి అభినవ్ దౌలా చెప్పారు.
విజయనగరం, నవంబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన రద్దయినట్టు సమాచారం. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు రానున్నారని అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ఇదిలా ఉండగా ఈ నెల 30న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లిమర్ల రానున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.