S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రేమకోసం ఛాలెంజ్ చేసి తన మేధస్సును పెంచుకుని ప్రేమలో గెలిచి ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనే కథనంతో రూపొందించిన ‘నిర్మలా కానె్వంట్’లో నటుడు రోషన్ చక్కగా నటించాడని దాసరి నారాయణరావు తెలిపారు.
బాహుబలి చిత్రం రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజవౌళి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతోపాటు సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు కూడా తాము ఎదురుచూస్తున్నామని చెబుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బొమ్మ పడిందంటే కలెక్షన్లు అదుర్స్గా వుంటాయని కూడా కథనాలు వస్తున్నాయి.
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై మిథున్ మాన్యుల్ థామస్ దర్శకత్వంలో సారా అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘పిల్ల రాక్షసి’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ పద్మావతి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిపికెట్ వున్న ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమైంది.
మనీష్, తేజస్విని జంటగా భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్రెడ్డి అందిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. తొలి సీడీని ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విజయవంతం కావాలని, పాటలు, ట్రైలర్లు అందరికీ నచ్చేలా ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో అటు కోస్తాంధ్ర, ఇటు తెలంగాణలలో వర్షాలు కురియనున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్తితి ఉంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది.
హైదరాబాద్:నగరంలో వరదలకు కారణమైన ఆక్రమణల తొలగింపులో ఎవరినీ ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు. నాలాల ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం మొదలైంది. జిహెచ్ఎంసీకి చెందిన 30మంది డిఇ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగుతోంది. కాగా ఎంతటివారినైనా ఉపేక్షించకుండా చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ల తొలి డిబేట్ ఆసక్తికరంగా, హోరాహోరీ సాగింది. న్యూయార్క్లోని ఓప్స్ట్రా యూనివర్శిటీలో ఈ చర్చాగోష్టి సాగింది. ఇరువురు అభ్యర్థులూ తమ ఆలోచనలను ఆవిష్కరించారు. టెర్రరిజం, పన్నులు, విదేశీవ్యవహారాలు, ఉద్యోగాలు, భద్రత వంటి అంశాలపై దీటైన చర్చ సాగించారు.
హైదరాబాద్:శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏపీ నీటిని విడుదల చేయడం లేదని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఈ మేరకు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లి:కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరక్టర్ జనరల్ బికె బన్సాల్ తన కుమారుడితో కలసి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజధానిలోని మధురానగర్లో ఆయన నివాసంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఫార్మ కంపెనీనుంచి గత జూలైలో 9 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడటంతో కేసు నమోదైంది. ఆయన జైలుపాలయ్యారు. ఆ తరువాత కేసు సీబిఐకు చేరింది.