S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 03:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళితులకు ఉపాది అవకాశాలు పెంపోదించేందుకు ఏటా పది వేల మంది చొప్పున వచ్చే మూడేళ్లలో 30వేల మందికి శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగు పెట్టనున్నట్టు ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది.

09/24/2016 - 03:12

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అల్పపీడనంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి (సిడిఆర్‌ఎఫ్) నుంచి తాత్కాలిక సహాయం అందజేస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

09/24/2016 - 03:10

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ నెల 29,30 తేదీల్లో జైళ్లలో సంస్కరణలపై ఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రరాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్రానికి తెలియచేసేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నివేదిక రూపొందించింది.

09/24/2016 - 03:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణలో ప్రకృతిసిద్ధమైన సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్‌లో తెలంగాణ తరపున చందూలాల్ పాల్గొన్నారు.

09/24/2016 - 03:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సిగంపూర్‌నుంచి చెన్నై వస్తున్న విమానంలో శుక్రవారం శామ్‌సన్ గెలాక్సీ నోట్-2 పేలిపోయింది. ఈ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయంలో విమానం లాండయ్యే సమయంలో ఈ ఫోన్ పేలినట్లు తెలుస్తోంది. ఫలితంగా విమానంలో స్వల్పంగా మంటలు చెలరేగగా, సిబ్బంది మంటలార్పే యంత్రాలతో ఆ మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.

09/24/2016 - 03:08

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ గ్రూప్-2 కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసే గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిసింది.

09/24/2016 - 03:07

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 23: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 26న జరిపే పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభం కానుంది. ప్రయోగం పై శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.

09/24/2016 - 03:05

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ తదనంతర ప్రచార పరిణామంలో తాము పూర్తిగా వెనుకబడిపోయామని ఏపి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

09/24/2016 - 03:02

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: తీర ప్రాంత రాష్ట్రాల్లో మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న ఇండియా, ఇంటర్నేషనల్ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ఆమె ప్రారంభించారు.

09/24/2016 - 02:56

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అసాధారణ వర్షాలతో సంభవించిన నష్టాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎస్ రాజీవ్ శర్మను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భారీ నష్టాలపై కేంద్ర సాయం కోరనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటన నుంచే సిఎం వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు.

Pages