S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 00:48

డాక్టర్ నీలం సంజీవరెడ్డి గొప్ప జాతీయ నాయకుడు మాత్రమేకాదు మహోన్నత జాతీయవాది. భారతీయులు గర్వించదగ్గ నిష్కళంక తేజోమూర్తి. స్వయం ప్రతిభతో, స్వయం కృషితో, అంచలంచలుగా ఎదిగి, రాజకీయాలలో అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన జీవిత కాలంలో అధికభాగం దేశ సేవకే అంకితంచేశారు.

05/20/2016 - 00:46

అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి హిమాలయ పాదసానువుల్లో ఉంటే, మరొకటి కన్యాకుమారి తీరంలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత వెలువడిన అతిపెద్ద ప్రజాభిప్రాయం (జనాదేశ్)ఇది. ఈ ఎన్నికలు మోదీ పాలనపై తీర్పు అంటూ ప్రతిపక్షాల వారు ఈ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు. నిజానికి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీల్లో భాజపాకు లోగడ అస్తిత్వం నామమాత్రమే.

05/20/2016 - 00:44

విద్యార్థి అనేపదానికి విద్యను అర్థించేవాడు అని అర్ధం. కాని ఈ పదం నేటి పాఠశాలలలో చదువుకునే వారికి ఎంతమాత్రం వర్తించదు. ఇంగ్లీషులో స్టూడెంట్ అనే పదానికి సరైన తెలుగు పదం కనిపించడం లేదు. కనుక ఈ పదాన్ని తప్పని పరిస్థతుల్లో వాడుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ఉచితంగా విద్యను అందిస్తోంది. దీనితోపాటు భోజనం పుస్తకాలు కూడా ఉచితమే. అనేక వసతి గృహాలున్నాయి.

05/20/2016 - 00:43

ప్రపంచంలో ఏ దేశంలో కులాలు లేవు. మన దేశంలో మాత్రమే కులాలు ఉన్నాయ. కుల రహిత సమాజం ఐనప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అణగారిన వర్గాల వారికి దేవుడిలాంటి డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మా వాడని చెప్పుకోవడానికి అగ్రవర్ణాలైన ముఖ్యమంత్రులు పోటీపడి ఎతె్తైన విగ్రహాలను స్థాపించడానికి పూనుకొనడం రాజకీయ ఎత్తుగడలో భాగం. కుల నిర్మూలన జరగాలంటే కులాలకతీతంగా వివాహాలు జరగాలి.

05/20/2016 - 00:42

ప్రజాస్వామ్యాన్ని రక్షించమంటూ ఇటీవల ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో‘‘ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తోంది, నాగపూర్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతోంది’’ అంటూ సోనియా,‘‘దేశాన్ని ఇద్దరే పాలిస్తున్నారు. వారు మోదీ, మోహన్ భాగవత్’’2 అంటూ రాహుల్ ద్వ జం ఎత్తడం గురివిందలు తమ నలుపెరుగని చందంగా ఉంది.

05/20/2016 - 00:13

నిజామాబాద్, మే 19: నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు జరిపే ప్రైవేట్ డీలర్ల గుట్టును కనుగొని రైతులు నష్టపోకుండా నిలువరించడంలో విజిలెన్స్ శాఖ అధికారుల పాత్ర ఎంతో కీలకమైనప్పటికీ, ఆ దిశగా జిల్లాలో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

05/20/2016 - 00:12

నిజామాబాద్, మే 19: ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం అన్న చందంగా ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న అధికార పార్టీ నేతలకు తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులోనూ రికార్డు స్థాయి మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం మరింత ఉత్సాహాన్ని అందించింది.

05/20/2016 - 00:12

ఆర్మూర్, మే 19: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బాలుడు విశాల్ కిడ్నాప్‌కు గురై మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో గురువారం ప్రత్యక్షమయ్యాడు. ఇంటి పక్కన నివాసం ఉండే వేముల శంకర్ బాలుడిని కిడ్నాప్ చేయగా అతనిపై మెట్‌పల్లి పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఓం ప్రకాష్, కవిత దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ఆర్మూర్‌కు వలసవచ్చారు.

05/20/2016 - 00:11

నిజామాబాద్, మే 19: కొలువుల క్రమబద్ధీకరణ కోసం గత ఎంతోకాలం నుండి ఎదురుతెన్నులు చూస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మరో అడుగు ముందుకుపడింది. గురువారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న 293మంది అధ్యాపకుల ఒరిజినల్ సర్ట్ఫికెట్లను ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా నియమించిన కమిటీ పరిశీలన జరిపింది.

05/20/2016 - 00:10

మాచారెడ్డి, మే 19: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కుల ప్రస్తావన తేవడం అర్థరహితమని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. మండలంలోని మంథని దేవునిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం మానవ వనురుల అభివృద్ధి ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్పు, అమ్మ ఒడి కార్యక్రమం అమలుపై చర్చ కొనసాగింది.

Pages