S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 03:20

పెనమలూరు, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని కోటీ 40లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పూర్తి స్టాక్ ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

04/14/2020 - 03:18

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినా అధికారులు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి కనగరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పరిస్థితులు కుదుటపడిన తరువాత ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాల్సి వొచ్చినా అందుకు సర్వ సన్నద్దంగా ఉండాలన్నారు.

04/14/2020 - 03:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గత మూడు వారాలుగా భారత దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ వల్ల అనూహ్య రీతిలో దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. మంగళవారం ముగుస్తున్న ఈ 21 రోజుల లాక్ డౌన్ కాలంలో దాదాపుగా భారత దేశం అంతా మూత పడింది. ఫ్యాక్టరీలు పని చేయలేదు, వ్యాపారాలు నడవలేదు, విమానాలు తిరగలేదు, రైళ్ళు పట్టాలు ఎక్కలేదు. వాహనాల రాకపోకలు కూడా దాదాపుగా ఆగిపోయాయి.

04/14/2020 - 02:59

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వివిధ క్లబ్‌లు మూతపడ్డాయి. ఆటగాళ్లు తమతమ ఇళ్లకు లేదా వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇబ్రహిమోవిచ్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకావడం చర్చనీయాంశమైంది
*చిత్రం... తనకు వాటా ఉన్న హామర్బీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లతో కలిసి స్టాక్‌హోమ్స్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన సాకర్ లెజెండ్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్.

04/14/2020 - 02:56

న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగ నిర్మాణ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోధనలను అనుసరించండి అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బలమైన, సంపన్నమైన భారత దేశాన్ని సృష్టించడానికి దోహదం చేయాలని ఆయన కోరారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

04/14/2020 - 02:54

బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మార్గాలు అనే్వషిస్తున్నట్టు సోమవారం ఇక్కడ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు వారాల లాక్‌డౌన్ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కోసం తాము వేచిచూస్తున్నట్టు సీఎం చెప్పారు.

04/14/2020 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

04/14/2020 - 02:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తన ఉత్పత్తిలో 15 శాతం కోత విధించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సప్లయర్లు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో ఓఎన్‌జీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించక ముందు ఓఎన్‌జీసీ రోజుకు 64.3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసేది.

04/14/2020 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (్ఫడా) కోరింది. ఈ మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ కుదేలైందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు నిలిచిపోయాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది.

04/14/2020 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులకు వీసా, ఈ-వీసా పరిమితి గడువును పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల భారత్ వచ్చిన పలువురు విదేశీయులు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు గడువు తీరిపోతే, అలాంటి వారికి ఈనెల 30వరకు వీసా, ఈ-వీసా గడువును పొడిగించింది.

Pages