S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ కార్యాలయం కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు విశేష సేవలు అందిస్తున్న వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ పరికరాలను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని ఎన్టీపీసీ ప్రకటనలో పేర్కొంది. గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులకు ఈ పరికరాలను అందచేశారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ పరికరాలను అందచేశారు.
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారత్కు చెందిన వైద్యులు కోవిడ్-19కు చెందిన వైరస్ మహమ్మారిపై పోరాటం చేయాలని, ఈ వైరస్ బారి నుంచి మానవాళిని కాపాడాలని గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఓరిజన్, ది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిజీషియన్స్ ఆఢఫ్ ఇండియన్ ఆరిజన్, బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ పిలుపునిచ్చాయి.
షాద్నగర్, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ వివరించారు. సోమవారం కమ్యూనిటీ ఆసుపత్రిలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రావద్దని ఫొన్ ద్వారా వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే టెలి మెడిసిన్ ద్వారా సూచనలను చేస్తామని వివరించారు.
ఉప్పల్, ఏప్రిల్ 13: అమెరికా యూఎస్ఏ నుంచి వచ్చిన హబ్సిగూడ కాకతీయనగర్ స్ట్రీట్ నెంబర్ 3లో నివసిస్తున్న ఓ యువతికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె తల్లిదండ్రులు రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో క్వారంటైన్లో ఉన్నారు.
మేడ్చల్, ఏప్రిల్ 13: రైతులు అధైర్య పడవద్దని ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని పూడూరు, మేడ్చల్ పీఏసీఎస్ కార్యాలయాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
తలకొండపల్లి, ఏప్రిల్ 13: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ చేయూత ఇస్తున్నారు.ఆమనగల్లు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల పేదలకు సుమారు 25 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టి ఇంటికో శానిటైజర్ పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాలలో ప్రతి కుటుంబానికి శానిటైజర్ అందించారు.
కొందుర్గు, ఏప్రిల్ 13: అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో కిరాణాషాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు కొందుర్గు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని మహాదేవ్పూర్ గ్రామంలో ఓ కిరాణాషాపు యజమాని అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
షాద్నగర్, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో కలకలం రేపుతుంది. తాజాగా 65 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ ధ్రువీకరించారు.
శామీర్పేట, మార్చి 13: జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో ఇద్దరు యువతులు అనుమానస్పదంగా మృతిచెందారు. కుషాయిగుడ ఏసీపీ శివ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు తమ భర్తలతో గొడవ పడి శామీర్పేట మీదుగా స్థానికంగా తెలిసిన పాస్టర్ సహాయంతో ఇక్కడికి వచ్చారు. పాస్టర్ ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు.
తాండూరు, ఏప్రిల్ 13: పట్టణంలో కరోన పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళకు వైరస్ సోకినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, పట్టణ సీఐ రవి కుమార్ తెలిపారు. మహిళను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.