S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 00:49

కేశంపేట, ఏప్రిల్ 13: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో శంకర్‌పల్లి నుంచి దేవరకొండకు కాలినడకన వెళ్తున్నారు. ఆరు కుటుంబాలు వెళ్తుండగా కేశంపేటలో ఎస్‌ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలను తెలుసుకున్నారు. 170 కిలోమీటర్లు కాలినడకన వెళ్లడం కుదరదని, స్థానికంగా నివాసం కల్పిస్తామని చెప్పారు. భోజన వసతిని సర్పంచ్ తలసాని వెంకట రెడ్డి కల్పించారు.
స్వీయ సంరక్షణతోనే నియంత్రణ

04/14/2020 - 00:48

కుషాయిగూడ, ఏప్రిల్ 13: కాప్రా చెరువు సుందరీకరణ పనులను వెంటనే చేపట్టాలని మున్సిపాల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. కాప్రా చెరువును అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ సూపరింటెండెంట్ పరంజ్యోతి, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డితో కలసి పరిశీలించారు.

04/14/2020 - 00:48

సైదాబాద్, మార్చి13: లాక్‌డౌన్ పరిస్థితులలో నిరాశ్రయులు ఆకలికి అలమటించకుండా అయ్యప్ప పాదయాత్ర సేవాసమితి ఆదరించటం అభినందనీయమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మలక్‌పేట, యాకత్‌పురా, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని పలుప్రాంతాలకు చెందిన దినసరి కూలీలు నిరుపేదలు 500 మందికి 17 రోజులుగా సేవాసమితి ప్రతినిధులు ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు.

04/14/2020 - 00:42

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సోమవారం నుండి విధులకు హాజరౌతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా గత 21 రోజుల నుండి ఇంటి నుండి పని చేస్తున్న మంత్రులు సోమవారం ఉదయం పది గంటలకే తమ, తమ కార్యాలయాలకు చేరుకోవటం గమనార్హం. వీరితోపాటు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా తమ విధులకు హాజరవుతున్నారు.

04/14/2020 - 00:18

హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భుతంగా ఉందని, ఈ పంటల కొనుగోలుకు బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, రబీలో 40 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 10 లక్షల ఎకరాల్లో పల్లీ, ఉద్యాన తదితర పంటలు వేశారని గుర్తు చేశారు.

04/14/2020 - 00:16

ఎక్కువ కేసులు ఇక్కడి నుంచే..* నగరాన్ని జోన్లుగా విభజించి యూనిట్లుగా ఏర్పాటు*
కంటైనె్మంట్లలో పకడ్బందీ ఏర్పాట్లు* రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలి*
ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
*

04/14/2020 - 00:14

హైదరాబాద్, ఏప్రిల్ 13: వలస కార్మికులకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. అయితే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల యోగక్షేమాలను కేటీఆర్ స్వయంగా సోమవారం వివిధ కన్‌స్ట్రక్షన్ సైట్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.

04/14/2020 - 00:11

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని, కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సోమవారం నాడు పిలుపునిచ్చారు. నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ కార్యాలయంలో మాస్క్‌ల ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.

04/14/2020 - 00:09

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఆదివారం వరకు 531 మందికి కరోనా సోకినట్టు ప్రకటించగా, సోమవారం నమోదైన 61 పాజిటివ్ కేసులను కలిపి మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 592కు చేరినట్టయింది.

04/13/2020 - 23:57

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ టెలీమెడిసిన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ - 14410ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 11 నాటికి 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

Pages