S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మీ వ్యూస్
గురు సినిమాను ఎలాం టి కమర్షియల్ విలువలు లేకుండా రొటీన్కు భిన్నం గా చక్కని కానె్సప్ట్తో తయారుచేశారు. గురు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయారు. తనకున్న ఇమేజ్ని గురించి ఆలోచించడు ఈ ఒకే ఒక్క నటుడు వెంకటేశ్. శిష్యురాలిగా నటించిన రితికాసింగ్ చక్కని నటన ప్రదర్శించారు. తొలుత అల్లరి పిల్లగా, ఆ తర్వాత బాక్సింగ్ క్రీడాకారిణిగా చివరకు గురువుకు తగ్గ శిష్యురాలిగా నటించి మెప్పించారు.
‘జై లవకుశ’ సినిమా క్లాస్, మాస్ అందరినీ అలరిస్తూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అనిపించుకుంది. సింహాద్రి తరువాత ఎన్టీఆర్ వన్మ్యాన్ షో అయింది జైలవకుశ. ఆద్యంతం ఎన్టిఆర్ కడుపుబ్బ నవ్వించడమే గాక కంటతడి పెట్టించాడు. నవరసాలనూ అలవోకగా పోషించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మూడు పాత్రల నటనలో ఇంతవరకూ ఎవ్వరూ చూపించలేనంత వైవిధ్యం చూపించాడు.
హరిశ్చంద్ర’ చిత్రంతో రుక్మిణిగారి నటన మొదలైంది. కథానాయకురాలుగా 40 చిత్రాలలో నటించింది. గుణసుందరి కథలో జూనియర్ శ్రీరంజనిగారితో సహచరురాలుగా నటించింది. ఎవియం సంస్థ నిర్మించిన శ్రీవల్లి చిత్రంలో నటించిన కథానాయకుడు మహాలింగం. హిందీలో లవంగి మంజరి చిత్రాలలో నటించింది. చిత్ర దర్శకుడు వై.వి.రావు వీరి భర్త! రుక్మిణి తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో నటించి మహానటిగా పేరుతెచ్చుకొన్నది.
పాటకంకి మురిసింది. వెనె్నలలో మెరిసింది. ఇం కా కొంచెం మెరిస్తే ఇంకా బాగా కాంతులీనేది. అదేమంటే కొమ్మినేని అప్పారావు చక్రవర్తి ఎలా అయ్యా డు. ఆయన జన్మించి చనువు చాలించినదెప్పుడు? ఇంకా మరింత లోతుకెడితే, ఆయన సంతానం ఎంత? వారికేమైనా సంగీ తం అబ్బిందా? నాకు తెలిసినంతవరకు చక్రవర్తిగా నామకరణం చేసింది దాసరి నారాయణరావు. ఈ సంగీతజ్ఞుడి శిష్యుడు కీరవాణి అని ఓ టీవీ కార్యక్రమంలో చూపారు.
విష్ణుప్రియ ప్రొడక్షన్స్ ‘వియ్యాలవారి కయ్యాలు, ‘వినాయక విజయము’, ‘కోరుకున్న మొగుడు’ చిత్రాలను గతంలో నిర్మించింది. ప్రస్తుతం ‘ప్రతిబింబాలు’ రీరికార్డింగ్, సెన్సార్ పూర్తయి ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం క్యూబ్ ప్రింటుకు డబ్బులేక ఆగిపోయింది. ఇందులో అక్కినేని, జయసుధ, గుమ్మడి, సుత్తివేలు మున్నగువారు నటించారు. మా ఆర్థిక పరిస్థితి దయనీయంగా వున్నదని ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయిక పాత్రలతో పాటు ప్రతినాయిక పాత్రలను వేసి మెప్పించిన ఎందరో ప్రముఖ నటీమణులు ఉన్నారు. భానుమతి ప్రతినాయిక పాత్ర ఉన్న తెనాలి రామకృష్ణుడు, పల్నాటియుద్ధం, పెద్దరికం వంటి పాత్రలలో అలరిపంజేశారు. తొలినాళ్ళలో అంజలీదేవి కీలుగుర్రం వంటి సినిమాల్లో నటించారు. ప్రముఖనటి సావిత్రి అభిమానం సినిమాలో ప్రతినాయిక పాత్ర ఉన్న పాత్రను పోషించారు.
వెనె్నల (12-9-17)లో చక్రవర్తిపై వ్యాసం బాగుంది. ఆయన ‘మదనమంజరి’ అనే హిందీ నుండి అనువాద చిత్రంలో ‘ఇదిగో బాబూ మూలిక’ అనే పాట ఘంటసాలతో పాడారు. ఈ చిత్రం సుమారు 1961లో వచ్చింది.
-డి.ఎస్.శంకర్, వక్కలంక
ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాళ్లు సినిమా థియేటర్ల వారిని సినిమా వాల్పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ వ్యక్తుల నివాసాల గోడలపై అంటించడం నిషేధించారు. కొన్ని పట్టణ ప్రాంతాలలో ఈ నిషేధం అమలువలన సినిమా ప్రేక్షకులకు ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది.
ఎన్టిఆర్ నటించిన జై లవకుశ చిత్రం చాలా బావుంది. మూడు పాత్రలలో ఎన్టిఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. జై, లవ, కుశ ఈ మూడు క్యారెక్టర్లకు ఎన్టిఆర్ జీవం పోశారని చెప్పొచ్చు.
-కె. అహల్య, మహబూబ్నగర్
ఫిలిం సెన్సారింగ్ని నిరసిస్తూ సెన్సార్ బోర్డుని ఎత్తేసి దర్శక నిర్మాతలకు స్వయం నియంత్రణ హక్కు ఇవ్వాలని పెద్ద తలకాయలు అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాయ. స్వయం నియంత్రణ అంటూ మీడియా ఎంత అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నదో చూస్తూనే ఉన్నాం. భారతీయులు అసలు నియంత్రణనే పట్టించుకోరు. పైగా స్వీయ నియంత్రణా? బూతు చిత్రాలు అనగానే కొందరు దర్శకులు జ్ఞాప కం వస్తారు. సెన్సారు బోర్డు లేకపోతే వాళ్లు విజృంభిస్తారు.