S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
డైరెక్టర్.. మెత్తటి డిక్టేటర్
తొలి చిత్రం సంకీర్తనతోనే ప్రేక్షకులను, పరిశ్రమను ఆకర్షించిన దర్శకుడు గీతాకృష్ణ. తర్వాత కోకిల, ప్రియతమా లాంటి అనేక చిత్రాలతో దర్శకుడిగా ప్రస్థానం సాగించారు.
పెద్ద డైరెక్టర్తో చిన్న చిట్ చాట్
అభిమానుల గుండె గొంతుకలో కొండంత బాధ మిగిల్చి -గత ఏడాది అంజలీదేవి, అక్కినేని, బాపు, బాలచందర్లాంటి ప్రముఖులు నిష్క్రమించారు. నిష్క్రమించిన వాళ్లలో రెండు పదుల వరకూ ఉంటే -2015కు ఆ సంఖ్య మూడు పదులైంది. పుట్టినోళ్లెవరూ పర్మినెంట్ కాకున్నా -ఆకస్మిక మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయన్న ఆదోళనతో గత ఏడాదే టాలీవుడ్ పెద్దలంతా కలిసి మృత్యుంజయ హోమం (మార్చి 23న) భారీగా నిర్వహించారు.
ఈవారం కూడా తెలుగు సినిమా బాక్సాఫీస్ ఆశాజనకంగా లేదు. భారీ అంచనాలతో పూరి జగన్నాథ్, వరుణ్తేజ్ తొలి కాంబినేషన్లో వచ్చిన ‘లోఫర్’, ‘అందమైన మాయ’, ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’ చిత్రాలతోపాటుగా హిందీనుండి వచ్చిన ‘బాజీరావు మస్తాని’, ‘దిల్వాలే’తో పాటుగా తమిళం నుంచి అనువదించిన సమంత, ధనుష్ల ‘నవమన్మధుడు’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘లోఫర్’ చిత్రం సరైన కథకథనాలు లేక చతికిలపడింది.
తెలుగులో హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో నటించినా సరైన కమర్షియల్ బ్రేక్ను అందుకోలేకపోయింది అందాల భామ శ్రద్ధాదాస్. పలు చిత్రాల్లో రెండో హీరోయిన్గా నటిస్తున్న ఈ భామ ఈమధ్య బాలీవుడ్లో కూడా ఓ చిత్రంలో నటించింది. మరోవైపు ప్రత్యేక పాటల్లో నర్తిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శ్రద్ధాదాస్ ‘డిక్టేటర్’ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది.
ఈమధ్యే మెగాహీరో వరుణ్తేజ్ సరసన ‘కంచె’ సినిమాలో హీరోయిన్గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాలభామ ప్రజ్ఞాజస్వాల్కు ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాల వెల్లువ ఎక్కువైంది. ప్రస్తుతం ఈ భామకు పలు అవకాశాలు వస్తున్నాయట. తాజా సమాచారం ప్రకారం క్రేజీ హీరో రవితేజ సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
ప్రముఖ తమిళ కథా సినీ రచయిత, సంభాషణలకర్త అయిన
ఎకె వేలన్ తొలిసారి నిర్మాతగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -తాయి పిరందల్ వాసిపిరక్కు. ఆ చిత్రం విజయం సాధించింది. ప్రముఖ నిర్మాత సుందర్లాల్ నహతా, విజయవాడ రామాటాకీసు
అధినేత అశ్వత్థనారాయణ కలిసి తమిళ చిత్రం హక్కులుకొని, శ్రీ ప్రొడక్షన్స్ బేనర్పై తెలుగులో నిర్మించిన చిత్రం
మంచి మనసుకు మంచి రోజులు.
ప్రస్తుతానికి సుక్కూతోనే...
- దర్శకుడు సూర్యప్రతాప్
కరెంట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తాజాగా కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు పల్నాటి సూర్యప్రతాప్. ఈ సందర్భంగా సూర్యప్రతాప్తో చిట్చాట్...
జానపద శైలిలో జనరంజక చిత్రాలను నిర్మాతలు నిర్మిస్తే -ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. జగదేకవీరుని కథ, చంద్రహారం లాంటి జానపదాలు ప్రేక్షకులను సినీ స్వర్ణయుగంలో మురిపించాయి. నాగిరెడ్డి, చక్రపాణిల ఆధ్వర్యంలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన కెవి రెడ్డి గొప్ప జానపద చిత్రాలు ఎన్నో నిర్మించారు.
‘జగదేకవీరుని కథ’ చిత్రం చివరలో ఘంటసాల ఆలపించిన పూర్తి సంగీత భరితమైన ఈ పాట అందరూ ఇష్టపడేదే. శాప కారణంగా రాయిలా మారిన ఓ గంధర్వుడికి శాప విమోచనం చేయడంకోసం రాకుమారుడు సంగీతాన్ని పాడాల్సి వస్తుంది. సంగీతంతో రాళ్లు కరగాలి. పూర్వకాలంలో సంగీతంతో వర్షాలు కురిపించిన మహామహులను గురించి విన్నాం. అదేవిధంగా ఈ చిత్రంలో సంగీతంతో పెద్ద కొండరాయిని కరిగించే సవాలును కథానాయకుడు ఎదుర్కొంటాడు.