S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2020 - 06:23

తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరునగరిలో భక్తుల గోవింద నామస్మరణలు లేవు. వాహనాల శబ్ధాలు లేవు....రైలు కూతలు లేవు.వీధుల్లో జనసంచారం లేదు. దుకాణాలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో వ్యాపార వాణిజ్యాలు నడవలేదు. ఏ వీధిచూసినా, ఏ వాడ చూసినా రోడ్లు నిర్మానుష్యంగా మారి తిరుమల, తిరుపతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా అని ఏ సూర్యగ్రహణమో పట్టలేదు. రాజకీయ నాయకులు బంద్‌కు పిలుపునివ్వలేదు.

03/23/2020 - 06:20

హైదరాబాద్, మార్చి 22: ప్రపంచానికే జనతా కర్ఫ్యూ స్పూర్తి దాయాకమని, దేశ చరిత్రలలోనే ఆపూర్వమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతొ జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతంగా కోనసాగిందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ పూర్తి మద్దతు తెలిపారన్నారు.

03/23/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహామ్మారిని స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను దూరంచేయవచ్చునన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో విజయవంతం చేశారు. ఇటు మంత్రులు, అటు అధికారులు జనతా కర్ప్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సంకేతాలు ఇచ్చారు.

03/23/2020 - 06:14

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు. నిపుణుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులను ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. ‘కరోనా లక్షణాలున్న వ్యక్తులెవరైనా మీ సమీపంలో ఉంటే అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ..

03/23/2020 - 06:13

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై ఈవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చితిలోనే లావాదేవీలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 4,187.52 పాయింట్లు (12.27 శాతం) పతనమైతే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1,209.73 పాయింట్లు (12.15 శాతం) నష్టపోయింది.

03/23/2020 - 06:12

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు.

03/23/2020 - 06:09

హైదరాబాద్, మార్చి 22: జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా, అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది.

03/23/2020 - 06:44

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలే తెలియచేస్తున్నాయి. ఆదివారానికి కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 27కు చేరింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.

03/23/2020 - 06:03

విజయవాడ, మార్చి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ఆదివారం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించిన సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య బృందాలు, వారికి సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి గవర్నర్ ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు.

03/23/2020 - 05:59

సబ్బవరం, మార్చి 22: విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం అమృతపురం గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి తన ఆటోలో తీసుకెళ్ళి సూరిరెడ్డిపాలెం శివార్లలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానిక సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలివి. బాలిక(15) సబ్బవరంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది.

Pages