S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 07:00

న్యూఢిల్లీ,ఆగస్టు 5: ఐదు కోట్ల మంది ఆంధ్రులు ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు, వారి ఆశలను దెబ్బ తీయకూడదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిర్ణయం ఈ దేశ పార్లమెంటు 2014లో తీసుకున్నదేనన్న వాస్తవాన్ని మరిచిపోకూడదని ఆయన సూచించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను బిజెపి, తెలుగుదేశం వెన్నుపోటు పొడుస్తోందని రాహుల్ ఆరోపించారు.

08/06/2016 - 07:00

హైదరాబాద్, ఆగస్టు 5: ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నాయన్న ఆభియోగాలపై జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి, వారి బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ దాడులు నిర్వహించింది. ఖైరతాబాద్‌లోని జిహెచ్‌ఎంసి సర్కిల్ -10 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారి (అసిస్టెంట్ సిటీ ప్లానర్)గా ఎ.సంతోష్ వేణు పనిచేస్తున్నారు.

08/06/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 5: సంస్కృతం, తెలుగు భాషల్లో పండితులు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తండ్రి అయిన కె రాఘవాచారి(90) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. పాదుకా సహస్రం సంస్కృత గ్రంధానికి రాఘవాచారి వ్యాఖ్యానం ప్రఖ్యాతి చెందింది. పలు సంస్కృత గ్రంథాలకు రాఘవాచారి వ్యాఖ్యానాలు చేశారు. తెలుగులోనూ పలు గ్రంథాలు ఆయన రచించారు. భాగవత సంప్రదాయాలను చివరి వరకు పాటించారు.

08/06/2016 - 06:58

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో స్వైన్ ఫ్లూ ప్రభావం తిరిగి కనిపిస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు స్వైన్ ఫ్లూ అనుమానంతో 99 మంది నమూనాలు పరీక్షించగా వీరిలో ముగ్గురిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా స్వైన్ ఫ్లూగా నిర్ధారించలేదు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలోనూ స్వైన్ ఫ్లూ వ్యాధి చికిత్సకు అవసరం అయిన మందులు అందుబాటులో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

08/06/2016 - 06:45

హైదరాబాద్, ఆగస్టు 5: నిర్మాణం పూరె్తై ఎంతోకాలంగా గృహ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వేలాది గృహాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వేలం ద్వారా ఇళ్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన గృహాలను చాలాకాలంగా ఎవరికీ కేటాయించకుండా వదిలేశారు. 3,718 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

08/06/2016 - 06:44

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 8 (1)కి అనుగుణంగా భూసేకరణ విధానాన్ని రూపొందించి కోర్టుకు సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను సింగిల్ హైకోర్టు జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు.

08/06/2016 - 06:42

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనేది నిర్ధారించే భారాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై పెట్టారు. ఆ బిల్లు ద్రవ్య బిల్లేనని స్పీకర్ నిర్ధారిస్తే దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరగదు. సుమిత్రా మహాజన్ ఇందుకు భిన్నంగా నిర్ణయించే పక్షంలో సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది.

08/06/2016 - 06:33

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రతిష్టాత్మక జిఎస్‌టి బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టి అదే రోజు ఆమోదింపజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజ్యసభ ఆమోదించిన బిల్లులో కొన్ని సవరణలు చేసినందున ఇది మళ్లీ లోక్‌సభ ఆమోదానికి వస్తోంది. సోమవారం దీనిపై జరిగే చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

08/06/2016 - 06:33

హైదరాబాద్, ఆగస్టు 5:కీలకమైన రెండు అంశాలలో ఏపి ప్రభుత్వానికి చుక్కెదురయింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వివరణలకు ఏపి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించలేదు. దీనితో పోలవరం పర్యావరణ అనుమతుల పొడిగింపు, రాజధానికి అటవీభూముల కేటాయింపు చిక్కుల్లో పడనున్నాయి.

08/06/2016 - 06:32

ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని తాను సభలో ఇచ్చిన హామీని అమలు చేయటం ద్వారా రాజ్యసభ గౌరవాన్ని నిలపాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బిజెపి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీకి హోదా విషయమై అప్పటి కేంద్ర కేబినెట్‌లోనూ నిర్ణయించామని స్పష్టం చేశారు. అప్పటి రాజ్యసభలో ఏపీకి సంబంధించి ఆరు హామీలిచ్చాను. వాటిని తప్పకుండా అమలు చేయండి అని మన్మోహన్ డిమాండ్ చేశారు.

Pages