S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 02:56

న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగ నిర్మాణ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోధనలను అనుసరించండి అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బలమైన, సంపన్నమైన భారత దేశాన్ని సృష్టించడానికి దోహదం చేయాలని ఆయన కోరారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

04/14/2020 - 02:54

బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మార్గాలు అనే్వషిస్తున్నట్టు సోమవారం ఇక్కడ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు వారాల లాక్‌డౌన్ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కోసం తాము వేచిచూస్తున్నట్టు సీఎం చెప్పారు.

04/14/2020 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

04/14/2020 - 02:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తన ఉత్పత్తిలో 15 శాతం కోత విధించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సప్లయర్లు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో ఓఎన్‌జీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించక ముందు ఓఎన్‌జీసీ రోజుకు 64.3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసేది.

04/14/2020 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (్ఫడా) కోరింది. ఈ మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ కుదేలైందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు నిలిచిపోయాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది.

04/14/2020 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులకు వీసా, ఈ-వీసా పరిమితి గడువును పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల భారత్ వచ్చిన పలువురు విదేశీయులు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు గడువు తీరిపోతే, అలాంటి వారికి ఈనెల 30వరకు వీసా, ఈ-వీసా గడువును పొడిగించింది.

04/14/2020 - 02:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు తల్లడిల్లుతుంటే సోమవారం ఢిల్లీ ప్రజలను భూకంపం వణికించింది. అయితే భూకంపం తీవ్రత (2.7) స్వల్పంగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 24 గంటల్లో ఇది రెండోసారి.

04/14/2020 - 01:35

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏప్రిల్ 2 నాటికి 1964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది.

04/14/2020 - 01:33

మానవ చరిత్రలో ఓ మహా ఉపద్రవం కోవిడ్-19 అనే ప్రాణాంతక మహమ్మారి యావత్ ప్రపంచం అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో ఓ పెను విలయంగా ఈ వైరస్ విశ్వాన్ని చుట్టుముట్టింది. 200కు పైగా దేశాలకు అవహించడంతో పాటు 10 లక్షల మందికి పైగా మరణించడానికి దారి తీసింది. ఇది విలయమా? విపత్తా? మానవ తప్పిదమా? ఉద్దేశపూర్వక ప్రయత్నమా?

04/14/2020 - 01:32

సమష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయనేది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక లక్షా పదిహేను వేలమందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమిష్టిగా చేస్తున్న కృషి ఇందుకు తాజా ఉదాహరణ.

Pages