తెలంగాణ

రాజీవ్ రహదారిపై ప్రమాదం : ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, డిసెంబర్ 10: హైదరాబాద్- కరీంనగర్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లా ములుగు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయ. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్ సుభాష్‌నగర్‌కు చెందిన శివశంకర్ (48), భార్య రేణుక (40), బావమరిది మధు (27), కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా బేగంపేట్ బంధువుల ఇంటికి ఆటోలో వెళ్తుండగా ములుగు మండల కేంద్రం వద్ద హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న క్వాలీస్ వాహనం వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్వరి అనే మహిళకు కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉండగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు పిల్లలను సికింద్రాబాద్‌లోని ఒక హాస్పిటల్‌కు తరలించినట్లు సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ హాస్పిటల్‌కు తరలించారు. క్వాలీస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గజ్వేల్ సిఐ సతీష్, ములుగు ఎస్‌హెచ్‌ఓ సైదీశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.