S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2020 - 04:27

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నపూర్ణ కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వలస కూలీల పరిస్థితుల పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వాలన్నారు.

04/14/2020 - 04:25

హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో ప్రవేశపరీక్షలకు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే గడువును మే 5వ తేదీ వరకూ పొడిగించగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్ 17వ తేదీ వరకూ పొడిగించారు.

04/14/2020 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో లాక్‌డౌన్ అమలు జరుగుతున్నందున గత సంవత్సరం మార్చి నెల బిల్లులనే ఈ ఏప్రిల్‌లో చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నందున వాటికి సంబంధించిన బిల్లులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు.

04/14/2020 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 13:కరోనా వ్యాధి బాధితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపధికన ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు అందించే వైద్య సదుపాయ ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ ఆసుపత్రిని పరిశీలించారు.

04/14/2020 - 01:21

నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంలో పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకుంటూ మిగిలిన ప్రాంతంలో అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

04/14/2020 - 01:19

నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండా లాక్‌డౌన్ ఆంక్షలను అధికార యంత్రాంగం కట్టుదిట్టం చేస్తునే వైరస్ బాధిత ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లు గుర్తించి ఆంక్షలు కఠినతరం చేస్తు వైరస్ విస్తరించకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

04/14/2020 - 04:30

వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మడికొండ లేదా ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.

04/14/2020 - 01:15

వనపర్తి, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండగా వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ జ్వరాలు వ్యాపించి అటు ప్రజలను, అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

04/14/2020 - 01:14

సంగారెడ్డి, ఏప్రిల్ 13: విరుగుడు లేని మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం ఏకమై పని చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పనికట్టుని చేస్తున్న విమర్శలను చూస్తుంటే కరోనాను మించిన వైరస్ ఏదో ఆవహించేదేమో అన్న అనుమానం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

04/14/2020 - 01:06

షాద్‌నగర్, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు నాయక్ వివరించారు. సోమవారం కమ్యూనిటీ ఆసుపత్రిలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రావద్దని ఫొన్ ద్వారా వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే టెలి మెడిసిన్ ద్వారా సూచనలను చేస్తామని వివరించారు.

Pages