తెలంగాణ
సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ రౌండ్టేబుల్ సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 March 2017
హైదరాబాద్, మార్చి 5: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించేందుకుగాను ఈ నెల 6న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టిపిసిసి ఉపాధ్యక్షు డు మల్లు రవి తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా- కోయిల్సాగర్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. సెంట్రల్ కోర్టు హోటల్లో జరిగే ఈ సమావేశానికి కన్వీనర్గా గద్వాల్ ఎమ్మెల్యే డికె అరుణ వ్యవహరిస్తారని రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు పాల్గొంటున్నారని వెల్లడించారు.