తెలంగాణ

కంటోనె్మంట్‌లో రోడ్ల మూసివేతతో ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోనె్మంట్ ప్రాంతంలో తరచూ రోడ్లను మూసివేస్తున్నందున స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై శాశ్వత పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోనె్మంట్‌లో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పారికర్ పాల్గొన్న సందర్భంగా మల్లారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. కంటోనె్మంట్ బోర్డు స్థలం ఇస్తే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఎంపీ అన్నారు. కంటోనె్మంట్ ఏరియా రక్షణశాఖ అధీనంలో ఉన్నందున ఇక్కడి సమస్యలపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో కృషి చేయాల్సి ఉంటుందని పారికర్ అన్నారు.