కృష్ణ
రాష్ట్రానికి మొండి చెయ్యి ఎమ్మెల్యే కాగిత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 9 February 2018
బంటుమిల్లి, ఫిబ్రవరి 8: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపటం బాధాకరమని పెడన ఎమ్మెల్యే, పీయుసీ చైర్మన్ కాగిత వెంకట్రావ్ అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరులో చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కాగిత ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని పట్టణంలో నిరసన తెలిపారు. అనంతరం నాగేశ్వరరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాగిత కృష్ణప్రసాద్, ఇల్లూరి లీలాకృష్ణ, మట్టా నాగబాబు తదితరులు పాల్గొన్నారు.