అంతర్జాతీయం

మరో 68మందికి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 29: పాకిస్తాన్ ఆదివారం 68 మంది మత్స్యకారులను కరాచీలోని లాంధి జైలు నుంచి విడుదల చేసింది. తన పరిధిలోని జలాల్లోకి ప్రవేశించారనే అభియోగంపై వీరిని అరెస్టు చేసి జైలులో పెట్టిన పాకిస్తాన్ చివరకు వారిని సానుభూతితో వదలిపెట్టినట్టుగా అభినయించింది. జైలునుంచి విడుదల చేసిన భారత మత్స్యకారులను లాహోర్‌కు వెళ్లే రైలు ఎక్కించడం జరిగిందని, అక్కడి నుంచి వారిని వాఘా సరిహద్దుకు తరలించి భారత అధికారులకు అప్పగించడం జరుగుతుందని పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్ర హోంశాఖ అధికారి నసీమ్ సిద్దిఖీ తెలిపారు. భారత మత్స్యకారులను విడుదల చేయవలసిందిగా అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి శనివారం తమకు ఆదేశాలు అందాయని ఆయన పేర్కొన్నారు. గట్టి పోలీసు భద్రత మధ్య మత్స్యకారులను వ్యాన్‌లలో ఎక్కించి రైల్వే స్టేషన్‌కు పంపించడం జరిగిందని, రైల్వే స్టేషన్‌లో ఈధి ఫౌండేషన్‌కు చెందిన వలంటీర్లు వారికి నగదు, బహుమతులను పంపిణీ చేశారని ఆయన చెప్పారు.