అంతర్జాతీయం

మరో భారతీయుడికి యూఏఈ జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 3: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహిస్తున్న లాటరీలో మరో భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. నైజీరీయాలో నివసించే డిక్సన్ కట్ట్థిర అబ్రహాం అబూదాబీలో లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఆ టిక్కెట్‌కు 10 మిలియన్ దిర్హామ్‌ల ప్రైజ్ మనీ దక్కింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.18,22,25,000లకు సమానం కాగా, అమెరికా డాలర్లలో 27,22,450. ఆదివారం ఉదయం అబూదాబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఇదే లాటరీలో గెలుపొందిన మరో 9 మందిలో ఐదుగురు భారతీయులు ఉండడం గమనార్హం. ఈ లాటరీని అబూదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ స్పాన్సర్ చేస్తోంది. గత ఏప్రిల్‌లో దుబాయ్‌లో నివసించే ఇండియన్ డ్రైవర్ ఒకరు ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసి 12 మిలియన్ దిర్హామ్‌ల బహుమతి పొందాడు. అలాగే జనవరిలో నిర్వహించిన మరో డ్రాలో యూఏఈలో నివసించే మరో ఇండియన్ 12 మిలియన్ దిర్హామ్‌లను అందుకున్నారు.