అంతర్జాతీయం

‘టైమ్’ ప్రభావశీలుర జాబితాలో మళ్లీ మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 26: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావ శీలుర జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి స్థానం లభించింది. అమెరికాకు చెందిన ‘టైమ్’ మ్యాగజైన్ ప్రతి ఏటా ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వందమందితో ఒక జాబితాను ప్రచురిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన కళాకారులు, రాజకీయ నాయకులు, శాస్తవ్రేత్తలు, ఐటి దిగ్గజాలు, వ్యాపారవేత్తలనుంచి ఓటింగ్ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. టైమ్ మ్యాగజైన్ వచ్చే నెల ఈ జాబితాను ప్రకటిస్తుంది. గత ఏడాది కూడా మోదీకి ఈ జాబితాలో స్థానం లభించింది. 2015లో తొలిసారిగా ఈ జాబితాలో మోదీకి స్థానం లభించగా, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మ్యాగజైన్‌లో మోదీకి సంబంధించిన ప్రొఫైల్ రాశారు. గత ఏడాది ఈ జాబితాలో మోదీతో పాటుగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సినీనటి ప్రియాంక చోప్రా, గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్, ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్‌లాంటి భారతీయులకు చోటు లభించింది. కాగా, ఈ ఏడాది ఈ జాబితాలో చోటుకోసం ఎంపికయిన ప్రాబబుల్స్‌లో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక, ఆమె భర్త, వైట్‌హౌస్ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నెర్, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్, నటుడు రిజ్ అహ్మద్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడెవ్ ప్రభృతులున్నారు.