తెలంగాణ

చిన్నారిని చిదిమేసిన కసాయి తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహీర్, డిసెంబర్ 19: మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య సొంత కూతురు సరోజ (14నెలలు)ను గొంతునులిపి చంపేశాడు. నిందితుడి భార్య మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. లక్ష్మి, దుర్గయ్యలకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం. నలుగురిలో మృతులు సరోజనే చిన్నకూతురు. అమ్మాయి పుట్టింది మొదలు తనకు దరిద్రం పట్టుకుందంటూ చిన్నారిపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం ప్రాంతంలో చిన్నారికి పాలిచ్చి నిందితుడి భార్య బాత్‌రూంకు వెళ్లిందే అదనుగా చిన్నారి గొంతునులిపి చంపేశాడు. వారం రోజులుగా చంపుతానంటున్నాడని ఎంతో అప్రమత్తంగా ఉన్నాననీ, ఇంతకు తెగిస్తాడని భావించలేదని చిన్నారి తల్లి బోరుమంది.