కృష్ణ

కరకట్టపై ప్రమాదంలో యువకుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మార్చి 29: కృష్ణానది కరకట్టపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగంటిపాడు దళితవాడకు చెందిన నిమ్మకూరి సురేష్‌కుమార్(37) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నిడమానూరులో మరదలి వివాహ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి బైక్‌పై వెళ్లాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత చాగంటిపాడు తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి వుండగా అవనిగడ్డకు చెందినవారు చూసి నైట్‌బీట్‌లో కనిపించిన పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో హెడ్ కానిస్టేబుల్ జ్వానేష్ వచ్చి సురేష్‌కుమార్‌ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సురేష్‌కుమార్ మృతిచెందాడు. ఏదైనా వాహనం ఢీకొని ఉండవచ్చని, లేదా బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురై ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జ్వానేష్ కేసు నమోదు చేయగా ఉయ్యూరు సర్కిల్ ఇనె్వస్టిగేషన్ టీం ఇన్‌చార్జి ఎఎస్‌ఐ శేషారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌కుమార్ మృతితో చాగంటిపాడు దళితవాడలో విషాదఛాయలు అలముకున్నాయి. సురేష్‌కి నలుగురు ఆడపిల్లలు ఉండగా, భార్య రాజేశ్వరి గర్భవతి.