కృష్ణ

కోదండ రామాలయంలో మంత్రి ఉమ ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 15: స్థానిక నూజివీడురోడ్‌లోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఉమకు ఆలయం వెలుపనుండి ఆలయ వేద పండితులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి లోనికి తోడ్కొని వెళ్ళారు. ఆలయంలో పురోహితులు స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం ఉమకు తీర్థ ప్రసాదాలు అందించారు. పూజలలో పాల్గొన్న అనంతరం స్వామి వారిని దర్శించుకుని అక్కడే స్థానిక సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పాలకవర్గాన్ని ఆదేశించారు. ట్యాంకర్లను ఏర్పాటు చేసైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.