కృష్ణ

విమర్శల్ని తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : సుస్థిర పాలన అందిస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బందరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం స్తానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వేదవ్యాస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లు నమ్మించి మోసం చేసిన కేంద్రంపై ధర్మపోరాటానికి దిగారన్నారు. దీనికి ప్రజలంతా మద్దతు ఇస్తుంటే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి ఓర్చుకోలేక ప్రభుత్వంపై లేని పోని విమర్శలకు దిగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బీజేపీ నేతలు సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటం గర్హనీయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుత తెలుగుదేశం పాలనలో జరుగుతున్నాయన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో మరోసారి టీడీపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గొర్రిపాటి గోపిచంద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్ (నాని), జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.