కృష్ణ

వైసీపీతోనే అగ్రి బాధితులకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: వైసీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆ పార్టీ విజయవాడ పార్లమెంటరి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌జిఎస్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్ధాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అగ్రిగోల్డ్ బకాయిల కోసం 1150 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి బాధితులను ఆదుకుంటామని అన్నారు. అగ్రిగోల్డ్ పేరుతో చంద్రబాబు పరోక్షంగా దోచుకోవడానికి వ్యూహం పన్నుతున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని, ఇదేమని ప్రశ్నిస్తే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. సమన్వయకమిటి కోఆర్డినేటర్ ఎంవి చలం అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో నేతలు వైస్ చైర్మన్ అక్భర్, మహిళా నేతలు ఎస్ విజిత, తన్నీరు నాగేశ్వరరావు, మూడు మండలాల పార్టీ అధ్యక్షులు తదితర నేతలు పాల్గొన్నారు.