కృష్ణ

కన్నులపండువగా శ్రీవారి పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం ఈవో హేమలతాదేవి దంపతులు శ్రద్ధతో శ్రీవారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకులు పీ మురళీ, పీ రాము ఆధ్వర్యంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిఉత్సవమూర్తులను ఒక ప్రత్యేక వైదికపై ఏర్పాటు చేశారు. అర్చకులు ఈవో దంపతులచేత తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దాత తాడేపల్లి వెంకట రమణ, బాలాత్రిపుర సుందరీ దంపతులు చేత స్వామికి పుష్పాలతో యాగాన్ని శ్రద్ధతో నిర్వహించారు. పవిత్ర కృష్ణనది నుండి జలాలను తెచ్చుకుని స్వామికి అభిషేకాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్వామికి వైభవంగా పవళింపు సేవ నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీ వసంత మల్లిఖార్జునస్వామి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ గుడిపాటి పాపారావు ఆర్థిక సహాయంతో స్వామికి నివేదించిన మహాప్రసాదాన్ని ఉభయదాతలు, భక్తులకు అన్నప్రసాదంగా అందజేశారు.