కృష్ణ

జగన్ సీఎం చేయడమే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిని సీఎంను చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు నిరంతర శ్రామికుల్లా పని చేయాలని ఆ పార్టీ బందరు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రామానాయుడపేటలోని వైసీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే పాలకులు పరిమితమయ్యారే గానీ ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. అటువంటి పాలకులను మళ్లీ అధికారంలోకి తీసువస్తే భవిష్యత్తు అంధకారమేనన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి పక్షాన ప్రజలంతా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏప్రిల్ 11వతేదీన జరిగే ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులకు ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియ చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి రావల్సిన అవశ్యకతను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.