కృష్ణ
ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ ఠాకూర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 April 2019
మచిలీపట్నం: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్పి ఠాకూర్ బుధవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పర్యటించారు. తొలుత మంగినపూడి బీచ్ను సందర్శించిన ఆయన కొద్దిసేపు బీచ్ వద్ద నెలకొని ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల చర్యలను ఎస్పీ త్రిపాఠిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.