కృష్ణ

డ్రైన్‌లో పడవ యజమాని గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, సెప్టెంబర్ 22: విద్యుదాఘాతానికి గురైన పడవ యజమాని నీటిలో గల్లంతైన సంఘటన గురువారం మండలంలోని కోరుకొల్లు శివారు చైతన్యపురంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం చైతన్యపురంలో చేపల పట్టుబడి నిమిత్తం ఆవకూరు వంతెన వద్ద పడవరేవు నుండి కూలీలతో పడవ యజమాని గంధం దొరబాబు(35) చైతన్యపురం బయలుదేరాడు. ఈ క్రమంలో ఒకవైపు నుండి మరోవైపుకి మోటారుకు ఉపయోగించే విద్యుత్ సర్వీసు వైరు దొరబాబుకు తగలటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరు కూలీలు షాక్ తగిలి పడవలో పడిపోయారు. దొరబాబు షాక్ తగిలిన వెంటనే డ్రైన్‌లో పడ్డాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో డ్రైన్ అధిక నీటితో ప్రవహించటంతో దొరబాబు గల్లంతయ్యాడు. కూలీలు దొరబాబును రక్షించే ప్రయత్నంలో సఫలం కాలేకపోయారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గజ ఈతగాళ్లను, భారీ వలలతో గాలింపు చర్యలు చేపట్టినా దొరబాబు ఆచూకీ దొరకలేదు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈసందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దొరబాబు కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు.