కృష్ణ

ఉత్తమ సేవలకు విశిష్ట పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఇరువురు అధికారులకు జిల్లా కలెక్టర్ నుండి విశిష్ట పురస్కారాలు లభించాయి. 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మచిలీపట్నం లో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఇరువురు అధికారులైన మైలవరం ఎంపిడిఓ డి సుబ్బారావు, మైలవరానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ అడిషినల్ డిప్యూటీ డైరెక్టర్ చాట్ల వీరాస్వామిలకు ఈపురస్కారాలు లభించాయి. విధి నిర్వహణలో అంకితభావం, ప్రభుత్వ పధకాలను అర్హత కలిగిన లబ్దిదారులకు అందించి వారి విలువైన సేవలను అందించినందుకు గానూ ప్రభుత్వం వీరిని ఉత్తమ అధికారులుగా ఎంపిక చేసి అవార్డులు అందించింది. వీరికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత చేతుల మీదుగా అవార్డులు దక్కాయి. వీరికి అవార్డులు దక్కటం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.

మునే్నటి పరీవాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు
నందిగామ/ కంచికచర్ల/ వత్సవాయి/ పెనుగంచిప్రోలు, జనవరి 26: నందిగామ ప్రాంతంలోని మునే్నటి పరీవాహక ప్రాంతంలో శనివారం రాత్రి భూమి కంపించింది. పెద్ద శబ్దం రావడంతో పాటు పలు ఇళ్లలో అటకపై ఉన్న సామాన్లు పడిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.