నల్గొండ

సర్వే ఫలితాలతో ఉలిక్కిపడ్డ ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ రూరల్, అక్టోబర్ 23: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టి ఆర్ ఎస్ వందకు పైగా స్ధానాల్లో గెలుస్తుందని సర్వే ఫలితాలు వెల్లడిస్తుండడంతో పిసిసి నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉలిక్కి పడుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఎద్దేవ చేశారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఆదివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ చేస్తున్న ప్రజారంజక పాలనకు సర్వే ఫలితాలు అద్దం పడుతున్నాయని అన్నారు. వచ్చే సారి కూడా ప్రతిపక్ష పార్టీలు అధికారం లోకి వచ్చే అవకాశం లేదని సర్వే ఫలితాలు చెబుతుండడంతో ఏమీ చేయాలో పాలుపోక ప్రతిపక్ష పార్టీల నాయకులు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసి ఆర్ దేనన్నారు. మిషన్ భగీరధ పధకం ద్వార రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీటిని అందిస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ పధకం ద్వార చెరువుల్లో పూడిక తీయడం వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెరువుల్లో నీటి నిలువలు చేరుకొని భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయన్నారు.