నల్గొండ

జిల్లాలో టిడిపి బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, డిసెంబర్ 2: యాదాద్రి జిల్లాలో టిడిపి బలోపేతం అవుతుందని పార్టీ జిల్లా అద్యక్షుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది నాయకులు పార్టీమారిన గ్రామాలలో టిడిపికి కార్యకర్తల బలం పటిష్టంగా ఉందని అన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కవాగ్దానాన్ని సక్రమంగా నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజాసమస్యలపై టిడిపి ఆద్వర్యంలో ఆందోళనలు చేపడుతామని అన్నారు. గ్రామాలలో పార్టీ సభ్యత్వాన్ని విరివిగా చేపట్టాలని, సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ఎలాంటి ప్రమాదం సంభవించినా రెండులక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుందని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి నుండి వెళ్లి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు చేసిందేమిలేదని అన్నారు. గ్రామాలలో టిడిపి సర్పంచ్‌లు చేసిన అభివృద్ది పనులు అధికార పార్టీ సర్పంచ్‌లు కూడ చేయడం లేదని విమర్శించారు. టిడిపి నుండి వెళ్లిన నాయకులు తిరిగి టిడిపి గూటికి చేరకతప్పదని అన్నారు. అనంతరం కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఆకవరపు మధుబాబు, డిసిఎంఎస్ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, నాయకులు తాళ్లపెల్లి సత్తిరెడ్డి, రాపోలు నర్సింహ్మ, బలరాం, ఫజల్‌బేగ్, భాస్కర్‌గౌడ్, కైరంకొండ నందు, వనం బిక్షపతి, జంగయ్య, నర్సింహ్మ, సుర్వి స్వామి తదితరులు పాల్గొన్నారు.