నల్గొండ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, ఏప్రిల్ 30: భువనగిరి-నల్లగొండ ప్రధాన రహాదారిపై నాతాళ్లగూడెం స్టేజీ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన భార్యభర్తలు రాసాల సోములు, జయమ్మ రామన్నపేట మండలం నీర్నెంల గ్రామానికి ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా నాతాళ్లగూడెం స్టేజీ సమీపంలో ఊక(పొట్టు) లారీ వెనకనుండి ఢీకొట్టడంతో లారీక్రింద పడి మృతి చెందారు. లారీ డ్రైవర్ తప్పించుకునేందుకై భువనగిరి-నల్లగొండ ప్రధాన రహాదారి వెంట కాకుండా నాతాళ్లగూడెం గ్రామం గుండా వెళ్లేందుకై ప్రయత్నించగా మధ్యలో రైల్వేగేట్ పడడంతో లారీ డ్రైవర్ లారీని నిలిపివేసి తప్పించుకుని పారిపోయాడు. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.