నల్గొండ
ఆసుపత్రి ముందు పసివాడి తల్లిదండ్రుల ధర్నా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 May 2016
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 30: ఆర్ఎంపి వైద్యుని నిర్లక్ష్యం తమ 8నెలల పసి బాలుడు శశాంక్ ప్రాణం తీసిందంటూ బాలుని తల్లిదండ్రులు స్థానిక దేవరకొండ రోడ్డులోని ఆర్ఎంపి వైద్యుని ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. గత పది సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామం నుండి వేపూరి పరుశురాములు తన భార్య సుకన్యతోసహా పట్టణంలోని వెంకటరమణ కాలనీలో దినసరి కూలీగా జీవిస్తున్నారు. అతనికి 8నెలల బాబు శశాంక్కు గత ఎనమిది రోజులుగా కుడి కాలుకు గడ్డతో జ్వరంతో బాధపడుతుండగా ఆర్ ఎంపి వైద్యుని సంప్రదించాడు. ఆర్ ఎంపి వైద్యుడు ఓవర్ డోస్ మందులు ఇచ్చారని దాంతో తన కుమారుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.